Social Drama OTT : గ్రామీణ ప్రాంతాల్లోని కుల వివక్ష, పరువు హత్యల వంటి సున్నితమైన అంశాలతో వచ్చిన సినిమా ‘దండోరా’. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సోషల్ మెసేజ్ డ్రామాకి ఆడియన్స్ నుంచే కాకుండా, సినీ నటుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను చూసి, కథను, నటీనటుల నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్కు అభినందనలు తెలిపాడు. ఇక ఈ సినిమా కథ ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
తెలంగాణ నేపథ్యంతో వచ్చిన ఈ ‘దండోరా’ (Dhandoraa) సినిమాను ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ దీనిని నిర్మించగా, మురళీకాంత్ దేవసోత్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2025 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. శివాజీ ప్రధాన పాత్రలో నటించగా, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2026 జనవరి 14 నుండి అమెజాన్ ప్రైమ్ (Prime Video) లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అగ్రకులానికి చెందిన శివాజీ అనే వ్యక్తికి, తన సొంత కుల సంఘంతోనే విభేదాలు వస్తాయి. అతను మరణించిన తర్వాత, అతని అంత్యక్రియలకు కుల పెద్దలు శ్మశానవాటికలో చోటు ఇవ్వడానికి నిరాకరిస్తారు. అసలు అగ్ర కులానికి చెందిన శివాజీని కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు? మనిషి మరణించినా ఎందుకు శ్మశానంలోకి అనుమతి ఇవ్వలేదు ? కుల వివక్షతో ఆ గ్రామంలో చోటుచేసుకునే రాజకీయాలు ఏమిటి ? అనే ప్రశ్నలతో ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా శివాజీ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని అభినందనలు వస్తున్నాయి.
Read Also : అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి… కూర వండుకుని తినే సైకో… గూస్ బంప్స్ పక్కా