E-Paper
Advertisement

Thriller Movie in OTT: థ్రిల్లింగ్ స్టోరీతో బ్యాంక్ రాబరి.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

Thriller Movie in OTT: థ్రిల్లింగ్ స్టోరీతో బ్యాంక్ రాబరి.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..
Advertisement

Thriller movie OTT : ఈ మధ్య ఓటీటీలోకి డిఫరెంట్ స్టోరీలతో మూవీలు తెరకేక్కుతున్నాయి. ఈ మధ్య ఒకదానికి మించి మరొకటి వస్తున్నాయి. అయితే జనాలు ఎక్కువగా థ్రిల్లర్ స్టోరీలతో వచ్చే సినిమాలకే మొగ్గు చూపిస్తున్నారు. అందుకే దర్శకులు అలాంటి డిఫరెంట్ కథతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా బ్యాంక్ రాబరి నేపథ్యంలో అదిరిపోయే థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ పేరేంటి ఎక్కడ చూడచ్చో? స్టోరీలోని ట్విస్ట్ లు ఏంటో ఒకసారి చూసేద్దాం..

మూవీ.. 

Advertisement

ఏప్రిల్ 24 న థియేటర్లలోకి వచ్చేసిన మూవీ చౌర్య పాఠం. ఈ మూవీ కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలోనైనా ముందస్తు పోస్టర్లు, టీజర్లు, రివ్యూలు వస్తుంటాయి. కానీ ‘చౌర్య పాఠం’ అనే ఈ సినిమా అలాంటి ప్రమోషన్ ఏమీలేకుండా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.

ఓటీటీ.. 

Advertisement

థ్రిల్లింగ్ కథతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఏప్రిల్ 24 న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు కేవలం 20 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నవరసాలతో కూడిన మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్నవారు ‘చౌర్య పాఠం’ సినిమాను తప్పకుండా చూడవచ్చు. కామెడీ, క్రైమ్, థ్రిల్లింగ్ మరియు భావోద్వేగాలు అన్నీ కలబోతగా ఈ సినిమా రూపొందింది. స్క్రీన్ ప్లే నిత్యం మలుపులు తీస్తూ ఆసక్తిని పెంచుతుంది..

స్టోరీ విషయానికొస్తే.. 

చౌర్య పాఠం మూవీ బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగుతుంది.. హాలీవుడ్ లో ‘మనీ హీస్ట్’, తెలుగు సినిమాల్లో ‘జీబ్రా’ వంటి చిత్రాలు ఈ తరహాలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘చౌర్య పాఠం’ కూడా అదే కోవలో ఉంటుంది.. ఈ మూవీలో కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఈ స్టోరీలో ఓ యువకుడికి సినిమా డైరెక్టర్ అవ్వాలన్న తపన ఉంటుంది. కానీ అతనికి అవకాశాలు రాకపోవడంతో తన కలను నెరవేర్చేందుకు బ్యాంక్ దొంగతనానికి ప్లాన్ చేస్తాడు. తన ప్లాన్‌లో బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని, అలాగే అదే బ్యాంకులో పని చేస్తున్న అంజలిని భాగస్వాములుగా చేసుకుంటాడు. అయితే పక్కనే ఉన్న స్కూల్ బిల్డింగ్ నుంచి సొరంగం తోవ్వి రాబరీకి వెళ్తాడు. ఇక థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా పేరు ఉన్న నటీనటులు లేకపోయినా ప్రేక్షకుల ఆదరణతో యావరేజ్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో నటించిన ఇంద్రరామ్‌, పాయల్ రాధాకృష్ణ హీరో, హీరోయిన్ పాత్రల్లో కనిపించగా, మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. సుప్రియ ఐసోల ఈ చిత్రంలో విలన్ పాత్రలో అదరగొట్టారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ కథను రాసారు. ఆ తర్వాత డబ్బులను కొట్టేశాడా? డైరెక్టర్ అయ్యాడా? ఇలాంటి ప్రశ్నలకు బ్రేక్ పడాలంటే మూవీని ఓటీటీలో చూడాల్సిందే… ప్రస్తుతం ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×