E-Paper
Advertisement

Thriller movie OTT: కిల్లర్ ని పరుగులు పెట్టించే హ్యాకర్… బుర్రకు పదును పెట్టే థ్రిల్లర్ మూవీ

Thriller movie OTT: కిల్లర్ ని పరుగులు పెట్టించే హ్యాకర్… బుర్రకు పదును పెట్టే థ్రిల్లర్ మూవీ
Advertisement

Thriller movie OTT : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఎదుర్కోనే సమస్య సైబర్ భద్రత. టెక్నాలజీ వల్ల లాభాలే కాదు, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా. రజిషా విజయన్ తన నటనతో సినిమాను నడిపించారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్స్ కూడా ఇందులో చక్కగా చూపించారు. ఈ మలయాళం సినిమాకి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కాలంలో అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఈ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

స్టోరీ ఏమిటంటే

రాహుల్ రిజి నాయర్ దర్శకత్వంలో 2022లో విడుదలైన ఈ మలయాళ టెక్నో-థ్రిల్లర్ సినిమా పేరు ‘కీడం’ (Keedam). ఇందులో రజిషా విజయన్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీనివాసన్, విజయ్ బాబు, మణికందన్ పట్టాంబి మిగతా పాత్రల్లో నటించారు. ఈ డిజిటల్ యుగంలో జరిగే నేరాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా 2022 మే 20న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం Zee 5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఐయండిబిలో దీనికి 6.3/10 రేటింగ్ కూడా ఉంది.

Advertisement

Read Also : మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

కథలోకి వెళ్తే

రాధిక బాలన్ (రజిషా విజయన్) ఒక ఎథికల్ హ్యాకర్. ఆమెకు సైబర్ సెక్యూరిటీలో మంచి పట్టు ఉంది. ఆమె తన తండ్రి బాలన్ (శ్రీనివాసన్) అనే రిటైర్డ్ లాయర్‌తో కలిసి జీవిస్తుంటుంది. ఒకానొక సందర్భంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు రాధికను లక్ష్యంగా చేసుకుని ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వేధించడం మొదలుపెడతారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో, రాధిక తన ఎథికల్ హ్యాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ నేరగాళ్లకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఇక ధైర్యంగా అడుగేసి పని మొదలు పెడుతుంది. ఇందులో ఆమెకు తండ్రి కూడా సపోర్ట్ గా నిలుస్తాడు. మరి ఆమె సైబర్ నేరగాళ్లకు రాధిక ఎలా బుద్ధి చెప్పింది ? వాళ్ళు ఆమెను ఎలా ఇబ్బంది పెట్టారు ? ఈ కథ ఆడియన్స్ కి ఎలాంటి సందేశం ఇస్తుంది ? అనే విషయాలను, ఈ మలయాళ టెక్నో-థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి. ఇక సినిమా కూడా మొదటి నుంచి చివరివరకు ఆసక్తికరంగా నడుస్తుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా రజిషా విజయన్, రాధిక బాలన్ పాత్రలో తన నటనతో కట్టిపడేసింది.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×