OTT Thriller Movie: ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి కొత్త కంటెంట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చినప్పుడు ఎలాంటి క్రేజ్ ను అందుకున్నాయో అంతకు మించి ఇక్కడ మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. అయితే హారర్ థ్రిల్లర్ మూవీస్ కు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య ఓటీటీలోకి కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలు కూడా ఓటీటీలోకి స్ట్రీమింగ్ వస్తున్నాయి. ఆ సినిమాలకు డిమాండ్ ఎలా ఉంటుందో ఆ వ్యూస్ ను బట్టి చూస్తున్నాం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడకు వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంటుంది.. తాజాగా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఇదొక హాలీవుడ్ మూవీ.. ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో ఒక్కసారి చూద్దాం..
మూవీ & ఓటీటీ..
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఇటీవల విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. గతేడాది వరుణ్ సందేశ్ నటించిన విరాజి చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ ఇప్పుడు రెండో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. గతంలో ఒకసారి ఓటీటీ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు మరో దాంట్లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. కానీ, రూ.99 రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రం గతేడాది ఆగస్టు 22వ తేదీనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ చిత్రానికి ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. ఓ మెంటల్ ఆసుపత్రికి చెందిన పాడుబడిన భవనంలో కొందరు చిక్కుకోవడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్గా ట్విస్టులతో కొనసాగింది.
Also Read : ఆ ఒక్క రోజు జరిగిందే మాస్టర్ కు శాపంగా మారిందా..? వెలుగులోకి మరో నిజం..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఇదొక డిఫరెంట్ స్టోరీ.. వరుణ్ సందేశ్తో పాటు ప్రమోదిని, రఘు కారుమంచి, బలగం జయరాం, రవితేజ నానిమ్మల, వైవా రవితేజ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మించగా.. ఎబెనేజర్ పౌల్ దర్శకత్వం వహించారు.. సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీ గా ఈ మూవీ వచ్చింది. ఒక వ్యక్తి ఈవెంట్ కోసమని ఒక కొండపైనున్న భవనంలోకి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా మిస్ అవుతారు. అక్కడికి వారిని పిలిచిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు.. ఎందుకు పిలిచాడు.. ఎందుకు చంపాలనుకున్నాడు.. చివరికి ఏం జరిగిందనే విషయాలు విరాజి చిత్రం ప్రధానంగా ఉంటాయి. ఈ చిత్రంలో ట్విస్టులు మెప్పించినా కూడా డైరెక్టర్ ఎక్కడో క్లారిటీ మిస్ చేశాడనే టాక్ ని అందుకున్నారు. దానికి మూవీ యావరేజ్ టాక్ ని అందుకుంది. థియేటర్లలో యావరేజ్ గా ఆడిన కూడా ఓటీడీ లో మాత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్అవుతున్న ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఓ భారీ ప్రాజెక్టు లో నటిస్తున్నారని తెలుస్తుంది.