OTT Movie : బాలీవుడ్ బ్యూటీ అదితి పోహంకర్ నటించిన ‘జిద్దీ ఇష్క్’ ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఆశ్రం’ ‘మండాల మర్డర్స్’ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ లో అదరగొట్టింది. బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ స్టోరీ మొదట లవ్ స్టోరీతో మొదలై , ఆ తరువాత రివేంజ్ మోడ్ లో కి వెళ్తుంది. ఇక ఈ సిరీస్ లో ఈ అమ్మడు యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో చేసింది. ఆడియన్స్ కూడా దీనిని ఆసక్తిగా చూస్తున్నారు. ఇందులో పరమ్బ్రత చట్టోపాధ్యాయ్ రోల్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
రాజ్ చక్రవర్తి రూపొందించిన ఈ సిరీస్ పేరు ‘జిద్దీ ఇష్క్’ (Ziddi Ishq). ఇందులో ఆదితి పోహంకర్ (మెహుల్ రోల్), పరమ్బ్రత చట్టోపాధ్యాయ్ (శేఖర్ దా) లీడ్ రోల్స్ లో నటించారు. 2025 నవంబర్ 21నుంచి JioHotstarలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సిరీస్ బెంగాలీ ఫిల్మ్ ‘పరిణీతా’ (2019) హిందీ రీమేక్. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఐయండిబిలో 7.2/10 రేటింగ్ పొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్ తో ఇది అందుబాటులో ఉంది.
కలకత్తా లో ఒక సాధారణ మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో మెహుల్ (ఆదితి పోహంకర్) అనే టీనేజ్ అమ్మాయి ఉంటుంది. ఆమె ఆమె తన పొరుగువాడు అయినటువంటి శేఖర్ (పరమ్ బ్రత చట్టోపాధ్యాయ్) తో ప్రేమలో పడుతుంది. అతను అదే ప్రాంతంలో ట్యూషన్ టీచర్ గా క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. అతను ఆమెకు పాఠాలు చెప్పడంతో పాటు, జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా ఆమెకు చెప్పుకుంటూ వస్తాడు. ఇక రాను రాను మెహుల్ కి అతని మీద ప్రేమ ఏర్పడుతుంది. ఎవరికీ చెప్పకుండా లోపలనే దాచుకుంటుంది. రోజూ అతని ఇంటి ముందు నిలబడి, చిన్న గిఫ్ట్స్ ఇచ్చి, కలల్లోనే సంతోషపడుతుంది.
Read Also : దేవుడి పేరుతో దిక్కుమాలిన పనులు… అమ్మాయిలను వదలకుండా… మతిపోగోట్టే సస్పెన్స్ థ్రిల్లర్