DCC Prisidents: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం శనివారం (నవంబర్ 22, 2025) కీలక ప్రకటన చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఆమోదం మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
‘సంఘటన్ సృజన్ అభియాన్’ (Sangathan Srijan Abhiyan) లో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్లు ఏఐసీసీ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కోసం ప్రతి జిల్లాకు ఏఐసీసీ పరిశీలకులను (Observers) ప్రత్యేకంగా నియమించారు. వీరు జిల్లాల్లో పర్యటించి, పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, ఇతర భాగస్వాములతో సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికలను సమర్పించారు. ఈ నివేదికల ఆధారంగా, సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాతే నూతన అధ్యక్షుల ఎంపిక జరిగిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకమైన బాధ్యతలను యువ నాయకులకు అప్పగించారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా, సికింద్రాబాద్ అధ్యక్షుడిగా కె. దీపక్ జాన్, ఖైరతాబాద్కు మోత రోహిత్ ముదిరాజ్ను నియమించారు. అలాగే, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా తోటకూర వజ్రేష్ యాదవ్ నియమితులయ్యారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) జిల్లాల వారీగా నియమించిన నూతన అధ్యక్షుల జాబితా ఇక్కడ ఉంది:
ఆదిలాబాద్: డా. నరేష్ జాదవ్ (Dr. Naresh Jadhav)
ఆసిఫాబాద్: శ్రీమతి ఆత్రం సుగుణ (Smt. Athram Suguna)
భద్రాద్రి కొత్తగూడెం: శ్రీమతి తోట దేవి ప్రసన్న (Smt. Thota Devi Prasanna)
భువనగిరి: బీర్ల ఐలయ్య (Shri Beerla Ilaiah)
గద్వాల: ఎం. రాజీవ్ రెడ్డి (Shri M. Rajeev Reddy)
హన్మకొండ: ఎంగల వెంకట్రామ్ రెడ్డి (Shri Engala Venkat Ram Reddy)
హైదరాబాద్: సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా (Shri Syed Khalid Saifullah)
జగిత్యాల: గాజెంగి నందయ్య (Shri Gajengi Nandaiah)
జనగామ: శ్రీమతి లకవత్ ధన్వంతి (Smt. Lakavath Dhanvanthi)
జయశంకర్ భూపాలపల్లి: బట్టు కరుణాకర్ (Shri Battu Karunakar)
కామారెడ్డి: మల్లికార్జున్ అలె (Shri Mallikarjun Ale)
కరీంనగర్: మేడిపల్లి సత్యం (Shri Medipally Sathyam)
కరీంనగర్ కార్పొరేషన్: వి. అంజన్ కుమార్ (Shri V Anjan Kumar)
ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్ (Shri Motha Rohit Mudiraj)
ఖమ్మం: నూతి సత్యనారాయణ (Shri Nuthi Satyanarayana)
ఖమ్మం కార్పొరేషన్: దీపక్ చౌదరి (Shri Deepak Chowdary)
మహబూబాబాద్: డా. భూక్యా ఉమ (Dr. Bhukhya Uma)
మహబూబ్నగర్: ఎ. సంజీవ్ ముదిరాజ్ (Shri A Sanjeev Mudiraj)
మంచిర్యాల: పిన్నింటి రఘునాథ్ రెడ్డి (Shri Pinninti Raghunath Reddy)
మెదక్: శివన్నగారి ఆంజనేయులు గౌడ్ (Shri Shivannagari Anjaneyulu Goud)
మేడ్చల్ మల్కాజిగిరి: తోటకూర వజ్రేష్ యాదవ్ (Shri Thotakura Vajresh Yadav)
ములుగు: పైడాకుల అశోక్ (Shri Paidakula Ashok)
నాగర్కర్నూల్: డా. చిక్కుడు వంశీ కృష్ణ (Dr. Chikkudu Vamshi Krishna)
నల్గొండ: పున్న కైలాష్ నేత (Shri Punna Kailash Netha)
నారాయణపేట: కొల్లకుదురు ప్రశాంత్ కుమార్ రెడ్డి (Shri Kollukuduru Prashanth Kumar Reddy)
నిర్మల్: వెడ్మ బొజ్జు (Shri Vedma Bhojju)
నిజామాబాద్: కట్పల్లి నాగేష్ రెడ్డి (Shri Katpally Nagesh Reddy)
నిజామాబాద్ కార్పొరేషన్: బొబ్బిలి రామకృష్ణ (Shri Bobbili Ramakrishna)
పెద్దపల్లి: ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ (Shri MS Raj Thakur)
రాజన్న సిరిసిల్ల: సంగీతం శ్రీనివాస్ (Shri Sangeetham Srinivas)
సికింద్రాబాద్: కె. దీపక్ జాన్ (Shri K Deepak John)
సిద్దిపేట: కుమారి తూముకుంట అన్క్షా రెడ్డి (Ms. Thumkunta Anksha Reddy)
సూర్యాపేట: గుడిపాటి నర్సయ్య (Shri Gudipati Narsaiah)
వికారాబాద్: ధారా సింగ్ జాదవ్ (Shri Dhara Singh Jadav)
వనపర్తి: కె. శివసేన రెడ్డి (Shri K. Shiva Sena Reddy)
వరంగల్: మహమ్మద్ అయూబ్ (Shri Mohammed Ayub)