E-Paper
Advertisement

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

Kavitha: తెలంగాణ ఎంపీలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు జాతీయ పార్టీలకు తెలంగాణతో బంధం తెగిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నా నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబట్టారు. మోదీకి భయపడి తెలంగాణ ఎంపీలు సైలెంట్‌గా కూర్చున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఎంపీలపై కవిత కామెంట్స్.. బంధం తెగిందని వ్యాఖ్య

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం లోక్ సభలో జరిగిన పరిస్థితులపై నోరు విప్పారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆమె దుయ్యబట్టారు.

కొంతమంది బీజేపీ ఎంపీలు తెలంగాణ ఏర్పడిన విధానంపై అత్యంత దారుణంగా మాట్లాడాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మన తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడి పెదవులు మూసుకొని కూర్చున్నారు ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నా, మన అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఉద్యమాలను అవహేళన చేస్తున్నా ఎంపీలు మాట్లాడకపోవడం దారుణమన్నారు.

మోదీకి తెలంగాణ ఎంపీలు భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా నోరు మెదపలేదు

గతంలో ప్రధాని కూడా అదే పని చేశారన్నారు. తల్లిని చంపి.. పిల్లను బతికించారని అన్నారన్నారని వివరించారు. అమిత్ షా వచ్చిన ప్రతీసారి తెలంగాణ విమోచన అంటూ కొత్త కథ చెబుతున్నారని అన్నారు. అదే కోవలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మన మీద కామెంట్స్ చేశారన్నారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు సభలో ఉన్నా, కనీసం నిరసన తెలపలేదన్నారు.

దీంతో తెలంగాణకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి సంబంధం తేల్చేశారామె. జాగృతి లాంటి పార్టీ ఉంటేనే రేపటి రోజుల ప్రాంతీయ పార్టీ ఇక్కడి ప్రజలు, వారి ఆకాంక్షల గురించి పోరాటాలు చేస్తుందన్నారు.

ALSO READ: మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ ….. అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు

మనల్ని అవమానిస్తున్నా మాట్లాడకపోవడం దారుణమన్నారు. డీలిమిటేషన్ వల్ల మనకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నా, ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో మనకు 3.1 శాతం ఉందని, అది పెరగాలన్నారు. కేంద్రం లెక్కల ప్రకారం 0.5 శాతం పెరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి తెలంగాణకు ఏమీ రావడం లేదని, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ పోతుందన్నారు.

డీలిమిటేషన్ కమిషన్ అన్నిచోట్లకు వెళ్లి ఏ పద్దతిలో చేయాలనేది తెలుసుకోవాలన్నారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం 50 శాతం సీట్లు పెంచుతామని ప్రకటన చేయడమేంటని ప్రశ్నించారు. అలా ప్రకటన చేసినప్పుడు కమిషన్ ఎందుకని ఎదురు ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్‌ వంటి అంశాలతో ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఇలాంటి చర్యల వల్ల దక్షిణాదిలో తెలంగాణ ప్రాధాన్యత తగ్గుతున్నట్లు వెల్లడించారు.

 

 

 

Related News

నువ్వా నేనా..? నాకా నీకా..!? కేంద్ర మంత్రి ప‌ద‌వి కోసం వ‌ర్గ‌పోరు..!

ఆ ఇద్ద‌రికీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే టార్గెట్‌! ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల రాజ‌కీయ వ్యూహం ఇదే!

బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?

లీడ‌ర్‌గా విమ‌ర్శ‌లు.. హీరోగా అభిమానం! ప‌వ‌న్ పై కేటీఆర్ మ‌నోగ‌తమిదేనా? ప‌వ‌న్ సినిమాలంటే అంత ఇష్ట‌మా?

మోడీ.. తేజ‌స్వీ సూర్య‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..! తెలంగాణ‌పై అవే అవే మాట‌లు! తేడా లేదు.. పాపం.. బీజేపీ!

అయ్య జాగీరే! రెచ్చ‌గొట్టి.. చిచ్చుపెట్టి..! తెలంగాణ బీజేపికి కొత్త చిక్కు తెచ్చిపెట్టి!

గ‌ద్ద‌ర్‌కు కారు కొనిచ్చా..! ఇదిప్పుడు బ‌య‌ట‌పెట్టడం వెనుక నీ ఉద్దేశ‌మేంద‌యా ప‌వ‌ను!?

డిమాండ్లు పెడుతూ.. డేట్లు ఫిక్స్ చేసుకుంటూ..! స‌ర్కార్ కు క‌విత డెడ్‌లైన్‌ల త‌ల‌నొప్పి..

Big Stories

×