మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా ఆపారనే గగ్గోలు నడుస్తున్న క్రమంలో ప్రధానంగా ఓ మహిళ గురించి డిస్కషన్ నడుస్తోంది. ఆమె సింప్లిసిటీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమే ప్రియాంక గాంధీ. ఆమె తాజాగా జరిగిన పార్లమెంటు ప్రత్యేక సెషన్లో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. వాస్తవానికి ప్రియాంక గాంధీ ప్రసంగాలను దేశంలో చాలా మంది చూసి ఉండరు. కానీ.. ఈ ప్రత్యేక సమావేశాలు జరిగిన నేపథ్యం .. అందరిలో ఉత్కంఠను రేపింది. ఏం జరుగుతుంది? బిల్లు పాసవుతుందా? మోడీ, అమిత్ షాలు ఏం మాయ చేస్తారు? వారికి సరిపడా బలం లేదు కదా! ఇవన్నీ.. చర్చకు వచ్చాయి. అందుకే ఎవరు మాట్లాడినా ఆసక్తిగా గమనించారు.
అందులో ప్రియాంక స్పీచును కూడా ఆసాంతం విన్నారు. ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. రాజకీయ విమర్శకులను, ప్రతిపక్షాల నుంచి కూడా ఆమెకు ప్రశంసలు లభించాయి. ఈ పరిణామం అనంతరం ఆమె ఫోటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సింపుల్గా ఆమె కాటన్ చీర కట్టుకుని, చేతిలో చిన్న బ్యాగుతో ఎలాంటి ఆడంబరం, హంగూ ఆర్బాటాలు లేకుండా.. సామాన్య మహిళలా ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఎంత సింప్లిసీటీ ప్రియాంకది. ఎంత ఎదిగినా ఒదిగుండాలంటారు. ఇదే కాబోలు. ఈమెను చూసి నేర్చుకోవాలి.. నేటి రాజకీయ మహిళానేతలు.. అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో ఆమె కలిసిపోయే తీరు, సాదాసీదా దుస్తులు, ఆడంబరాలకు దూరంగా ఉండే స్వభావం అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్ద పెద్ద రాజకీయ నేతలకు ఉండే భద్రతా హడావుడి, ప్రోటోకాల్ మధ్య కూడా సాధారణ మహిళలా ప్రవర్తించడం ఆమె ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు.
రాహుల్ గాంధీ సైతం ఆమె మాట్లాడిన తీరును మెచ్చుకున్నారు. తనకు ఎంతో గర్వంగా అనిపించిందని పార్లమెంటు సాక్షిగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అమిత్ షా.. రాహుల్ మాట్లాడిన తీరును విమర్శించే క్రమంలో ప్రియాంక గురించి ప్రస్తావించారు. సభలో ఎలా మాట్లాడాలో ప్రియాంకను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఎందుకంటే ఆమె .. అమిత్ షాను ఉద్దేశించి రాజకీయ చాణక్యుడని పొగడుతూనే ..తమకు అనుకూలంగా చట్టాల రూపకల్పన చేయడంలో దిట్ట అనే విధంగా పరోక్షంగా విమర్శించారు.దీనికి అమిత్ షా కూడా నవ్వుకున్నారు.