Data Expiry Issue: టెలికాం సంస్థల దోపిడి పార్లమెంటు వేదికగా ఎండగడుతున్న యువ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. సోమవారం కీలక అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభలో మాట్లాడుతూ మొబైల్ వినియోగదారుల డేటా వినియోగానికి సంబంధించి ప్రధానమైన సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న ‘డైలీ డేటా ఎక్స్పైరీ’ విధానం వల్ల సామాన్యులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం టెలికాం కంపెనీలు రోజుకు 1.5GB, 2GB లేదా 3GB వంటి పరిమితులతో ప్లాన్లను అందిస్తున్నాయని ఎంపీ రాఘవ్ చద్దా గుర్తు చేశారు. ఒకవేళ వినియోగదారుడు ఆ రోజుకు నిర్దేశించిన డేటాను పూర్తిగా వాడినా, వాడకున్నా అర్ధరాత్రి 12 దాటగానే మిగిలిన డేటా మెుత్తం మాయమవుతోందని పేర్కొన్నారు. ‘వాడని డేటాకు రీఫండ్ ఉండదు, మరుసటి రోజుకు బదిలీ (Rollover) ఉండదు. ఇది కంపెనీల దోపిడీ’ అని ఎంపీ మండిపడ్డారు. మిగిలిపోయిన డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Telecom Companies ऐसे Recharge Plans offer करती हैं जिनमें ‘Daily Data Limits’ जैसे 1.5GB, 2GB या 3GB per day होती हैं, जो हर 24 hours में reset हो जाती हैं। बचा हुआ data midnight पर expire हो जाता है, जबकि उसके पूरे पैसे पहले ही दिए जा चुके होते हैं।
आपको 2GB के लिए charge किया… pic.twitter.com/i7Ib42nFMK
— Raghav Chadha (@raghav_chadha) March 23, 2026
వినియోగదారుడు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా వారి ‘డిజిటల్ ఆస్తి’ అని ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. మనం పెట్రోల్ కొట్టించుకుంటే అది వాడనంత కాలం ట్యాంకులోనే ఎలా ఉంటుందో డేటా కూడా అలాగే ఉండాలని ఉదాహరణగా చెప్పారు. ఒక వినియోగదారుడు నిరంతరం తన డేటాను తక్కువగా ఉపయోగిస్తే ఆ విలువను తదుపరి రీఛార్జ్ ప్లాన్లో తగ్గింపు (Discount) రూపంలో సర్దుబాటు చేసే మెకానిజం ఉండాలని ప్రతిపాదించారు.
మన దగ్గర ఉన్న డబ్బును ఇతరులకు బదిలీ చేసినట్లే మన డైలీ లిమిట్లో మిగిలిపోయిన డేటాను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు బదిలీ చేసుకునే వెసులుబాటును టెలికాం సంస్థలు కల్పించాలని రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ‘డిజిటల్ ఇండియా’ను నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో చెల్లించిన సేవలు అర్థాంతరంగా మాయం కాకూడదని పేర్కొన్నారు.
నెలవారీ ప్లాన్లను 28 రోజుల వ్యాలిడిటీకే పరిమితం చేయడాన్ని కూడా ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంటులో తప్పుబట్టారు. దీనివల్ల వినియోగదారులు ఏడాదికి 12 సార్లకు బదులు 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. టెలికాం సంస్థలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయని పార్లమెంట్లో గర్జించారు. మరోవైపు ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఇన్ కమింగ్ కాల్స్ నిలిపివేతపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.
Also Read: LPG Gas: గంటపాటు వంట చేస్తే.. ఖర్చయ్యే LPG ఎంత? గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ బెస్ట్!