E-Paper
Advertisement

Data Expiry Issue: అర్ధరాత్రి దాటితే.. మెుబైల్ డేటా మాయం.. రాజ్యసభలో గర్జించిన ఎంపీ

Data Expiry Issue: అర్ధరాత్రి దాటితే.. మెుబైల్ డేటా మాయం.. రాజ్యసభలో గర్జించిన ఎంపీ

Data Expiry Issue: టెలికాం సంస్థల దోపిడి పార్లమెంటు వేదికగా ఎండగడుతున్న యువ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. సోమవారం కీలక అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభలో మాట్లాడుతూ మొబైల్ వినియోగదారుల డేటా వినియోగానికి సంబంధించి ప్రధానమైన సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న ‘డైలీ డేటా ఎక్స్‌పైరీ’ విధానం వల్ల సామాన్యులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.

డేటా రోల్‌ఓవర్ డిమాండ్

ప్రస్తుతం టెలికాం కంపెనీలు రోజుకు 1.5GB, 2GB లేదా 3GB వంటి పరిమితులతో ప్లాన్‌లను అందిస్తున్నాయని ఎంపీ రాఘవ్ చద్దా గుర్తు చేశారు. ఒకవేళ వినియోగదారుడు ఆ రోజుకు నిర్దేశించిన డేటాను పూర్తిగా వాడినా, వాడకున్నా అర్ధరాత్రి 12 దాటగానే మిగిలిన డేటా మెుత్తం మాయమవుతోందని పేర్కొన్నారు. ‘వాడని డేటాకు రీఫండ్ ఉండదు, మరుసటి రోజుకు బదిలీ (Rollover) ఉండదు. ఇది కంపెనీల దోపిడీ’ అని ఎంపీ మండిపడ్డారు. మిగిలిపోయిన డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉపయోగించని డేటా.. ‘డిజిటల్ ఆస్తి’

వినియోగదారుడు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా వారి ‘డిజిటల్ ఆస్తి’ అని ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. మనం పెట్రోల్ కొట్టించుకుంటే అది వాడనంత కాలం ట్యాంకులోనే ఎలా ఉంటుందో డేటా కూడా అలాగే ఉండాలని ఉదాహరణగా చెప్పారు. ఒక వినియోగదారుడు నిరంతరం తన డేటాను తక్కువగా ఉపయోగిస్తే ఆ విలువను తదుపరి రీఛార్జ్ ప్లాన్‌లో తగ్గింపు (Discount) రూపంలో సర్దుబాటు చేసే మెకానిజం ఉండాలని ప్రతిపాదించారు.

డేటా బదిలీకి అవకాశం

మన దగ్గర ఉన్న డబ్బును ఇతరులకు బదిలీ చేసినట్లే మన డైలీ లిమిట్‌లో మిగిలిపోయిన డేటాను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు బదిలీ చేసుకునే వెసులుబాటును టెలికాం సంస్థలు కల్పించాలని రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ‘డిజిటల్ ఇండియా’ను నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో చెల్లించిన సేవలు అర్థాంతరంగా మాయం కాకూడదని పేర్కొన్నారు.

Also Read: Free OTT Subscriptions: ఒక్క రీఛార్జ్‌తో.. Netflix, Hotstar, Prime ఫ్రీ.. ఓటీటీ ప్రియులూ ఇక రెచ్చిపోండి!

28 రోజుల రీఛార్జ్‌పై విమర్శలు

నెలవారీ ప్లాన్లను 28 రోజుల వ్యాలిడిటీకే పరిమితం చేయడాన్ని కూడా ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంటులో తప్పుబట్టారు. దీనివల్ల వినియోగదారులు ఏడాదికి 12 సార్లకు బదులు 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. టెలికాం సంస్థలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయని పార్లమెంట్‌లో గర్జించారు. మరోవైపు ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఇన్ కమింగ్ కాల్స్ నిలిపివేతపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.

Also Read: LPG Gas: గంటపాటు వంట చేస్తే.. ఖర్చయ్యే LPG ఎంత? గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ బెస్ట్!

Related News

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

Big Stories

×