Airtel Plan: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎప్పకప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్స్ ను తీసుకొస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బడ్జెట్ యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్ అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం రూ. 489 ప్లాన్ తీసుకొచ్చింది. తక్కువ ధరలో 77 రోజుల లాంగ్ వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.
ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 77 రోజుల ప్లాన్ తో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమితంగా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్లాన్ మెుత్తం కాలానికి 600 ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు. ఇక డేటా విషయానికి వస్తే.. వ్యాలిడిటీ కాలానికి 6GB మాత్రమే లభించనుంది. ఈ డేటాను 77 రోజుల్లో ఎప్పుడైనా, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు.
కాలింగ్, డేటాతో పాటు ఎయిర్టెల్ ఈ ప్లాన్పై కొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం యూజర్లకు అందిస్తోంది. హెల్త్కేర్ సేవలకు సంబంధించి 3 నెలల ఉచిత ‘అపోలో 24/7 సర్కిల్’ సభ్యత్వం ఆఫర్ చేస్తోంది. దాంతోపాటు ‘వింక్ మ్యూజిక్’ యాప్ ద్వారా మీకు నచ్చిన పాటలను ఉచితంగా హలో ట్యూన్స్గా సెట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
ఇంట్లో లేదా ఆఫీసులో వైఫై అందుబాటులో ఉండి.. మెుబైల్ డేటాతో పెద్దగా పనిలేదనుకునేవారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. అలాగే ఎయిర్టెల్ సిమ్ ను కేవలం ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కోసం మాత్రమే భావించే వారికి ఇది సెట్ అవుతుంది. అదే విధంగా ఆత్మీయులతో నిరంతరాయంగా మాట్లాడటానికి ఫోన్ ఉపయోగించే వృద్ధులకు, గ్రామీణ వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
Also Read: ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్.. అత్యంత చౌకగా లభించే.. టాప్-5 ఖరీదైన ఫోన్లు ఇవే!
ఈ ప్లాన్ను చాలా సులభంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ను ఓపెన్ చేసి.. రీఛార్జ్ సెక్షన్లో రూ. 489 ప్లాన్ను ఎంచుకుని యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయెుచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ అయినా గుగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీయంలోని రీఛార్జ్ సెక్షన్ వెళ్లి కూడా ఎయిర్ టెల్ ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు. ఆన్ లైన్ రీఛార్జ్ వీలుపడని పక్షంలో దగ్గరలోని ఎయిర్ టెల్ స్టోర్, రీటైల్ షాపు వద్దకు వెళ్లైనా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది.