E-Paper
Advertisement

Apple : ఇండియాలో కోట్లలో మెుబైల్ మార్కెట్.. ఆ ఫోన్స్ ఏ టాప్

Apple : ఇండియాలో కోట్లలో మెుబైల్ మార్కెట్.. ఆ ఫోన్స్ ఏ టాప్

Apple : టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఇండియాలో రికార్డ్ స్థాయిలో విక్రయాలు నమోదు చేసింది. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా ఐఫోన్స్ అమ్ముడైపోయాయని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ తెలిపారు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను లాంఛ్ చేస్తూ యూజర్స్ ను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. గత ఏడాది ఎన్నో లేటెస్ట్ గాడ్జెట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేసిన ఈ సంస్థ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. ముఖ్యంగా భారత్ లో ఎప్పుడూ లేనంతగా యాపిల్ అమ్మకాలు జరిపినట్లు తెలుస్తుంది. అక్టోబర్ – డిసెంబర్ నెలల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రెండవ అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా నిలిచిందని ఆ సంస్థ సీఈఓ టెమ్ కుక్ తెలిపారు.

ఇక మ్యాక్ బుక్స్, టాబ్లెట్లకు మూడో అతిపెద్ద మార్కెట్ గా యాపిల్ నిలిచిందని వెల్లడించారు. అయితే భారత్ లో అత్యధికంగా అమ్ముడైపోయిన స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ నిలవటం ఇదే మొదటిసారి. కాగా భారత్ తో పాటు చైనా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం ఐఫోన్ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని టిమ్ కుక్ తెలిపారు.

ఇక తాజాగా కౌంటర్ రీసెర్చ్ తెలిపిన సమాచారం ప్రకారం.. 2024లో యాపిల్ 23%, సామ్సంగ్ 22% మార్కెట్ వాటా సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది. వివో 16%, ఒప్పో 14%, షావోమి 9% వాటాలతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.

ALSO READ :  ఇండియా సొంత ఏఐ.. మరో 6 నెలల్లో సాధ్యమే!

టక్ దిగ్గజం యాపిల్ ప్రస్తుతం భారత్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా యాపిల్ తన లేటెస్ట్ గాడ్జెట్స్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ను పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్ ను ఇంగ్లీషుతో సహా మరిన్ని భాషలకు సపోర్ట్ చేసేలా త్వరలోనే తీసుకొస్తామని.. భారత్ లో ఉన్న అన్ని ముఖ్యమైన భాషల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులోకి ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా భారత్ ఎంటర్ప్రైజ్ విభాగం నుంచి యాపిల్ కు గట్టి డిమాండ్ ఉందని కూడా చెప్పుకువచ్చింది.

ఇక యాపిల్ కంపెనీ విక్రయాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో 2023 ఏప్రిల్ లోనే ముంబై, ఢిల్లీలో రెండు రిటైల్ స్టోర్లను యాపిల్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ స్టోర్స్ కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో త్వరలోనే బెంగుళూరు, ఢిల్లీ ఎన్సీఈఆర్, బెంగుళూరు, ముంబైలో మరిన్ని స్టోర్లను తీసుకురానున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది.

ఇక ఈ ఏడాది యాపిల్ 20 టాప్ గాడ్జెట్స్ ను తీసుకురాటానికి సిద్ధమవుతుంది. ఎంతో గ్రాండ్ గా ఐఫోన్ 17 సిరీస్ ను లాంఛ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో లేటెస్ట్ ఫీచర్స్ తో నాలుగు మొబైల్స్ రాబోతున్నాయి. తక్కువ బడ్జెట్ లోనే యాపిల్ తీసుకురాబోతున్న ఐఫోన్ SE4 మొబైల్ సైతం రాబోతుంది. వీటితో పాటు ఐప్యాడ్, హోమ్ గ్యాడ్జెట్స్, ఎయిర్ పాడ్స్, స్మార్ట్ వాచెస్ సైతం రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ విక్రయాలు మరింతగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×