E-Paper
Advertisement

Bill Gates: ఇండియా ఏఐ సదస్సు నుంచి బిల్ గేట్స్ అవుట్.. ఆ వివాదమే కారణమా?

Bill Gates: ఇండియా ఏఐ సదస్సు నుంచి బిల్ గేట్స్ అవుట్.. ఆ వివాదమే కారణమా?
Advertisement

Bill Gates: ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 నుంచి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు తప్పించడం అంతర్జాతీయంగా చ‌ర్చియానీయాంశంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో బిల్ గేట్స్ కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా ఆయన పేరును అతిథుల జాబితా నుంచి తొలగించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల అమెరికా న్యాయ‌శాఖ వెల్ల‌డించిన జెఫ్రీ ఎబ్స్టీన్ వ్యవహారానికి సంబంధించిన వివాదాస్పద పత్రాల్లో బిల్ గేట్స్ పేరు బయటపడటమే దీనికి ప్రధాన కారణమని సమాచారం. ఎబ్స్టీన్ కేసులో బయటపడిన తాజా ఫైల్స్‌లో బిల్ గేట్స్‌కు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ సదస్సుకు వివాదాస్పద వ్యక్తులు హాజరుకావడం సరికాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రాథమికంగా సమీక్ష జరిపిన నిర్వాహకులు.. ఆయనకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం బిల్ గేట్స్ ఈ సదస్సులో జరిగే ఒక ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చలో పాల్గొనాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం, దానివల్ల కలిగే సామాజిక మార్పులపై ఆయన ప్రసంగించాల్సి ఉంది. కానీ ఎబ్స్టీన్ పత్రాల వివాదం నేపథ్యంలో ఆయన హాజరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి, సదస్సు వెబ్‌సైట్ నుంచి కూడా ఆయన పేరును మరియు ఫోటోను తొలగించింది. ప్రస్తుతం సదస్సు అధికారిక వెబ్‌సైట్‌లో అతిథుల జాబితాలో బిల్ గేట్స్ పేరు కనిపించడం లేదు.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కేవలం నైతిక కారణాల దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ నిర్వహిస్తున్న ఇటువంటి అంతర్జాతీయ వేదికలపై ఎటువంటి మచ్చ పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. బిల్ గేట్స్ వంటి ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించి, ఆ తర్వాత తొలగించడం అనేది దౌత్యపరంగా కూడా చర్చకు దారితీస్తోంది. అయితే, ఈ సదస్సులో ఇతర గ్లోబల్ టెక్ లీడర్లు, ఏఐ నిపుణులు యధావిధిగా పాల్గొంటున్నారు.

Advertisement

ఈ పరిణామం ఒక్కసారిగా టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. మైక్రోసాఫ్ట్ సంస్థ గానీ, బిల్ గేట్స్ వ్యక్తిగత ప్రతినిధులు గానీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గతంలో ఎబ్స్టీన్ తో సంబంధాల విషయంలో బిల్ గేట్స్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు.  ఒక దేశం అధికారికంగా నిర్వహించే సదస్సు నుంచి ఆయన పేరును ఇలా తొలగించడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Supreme Court:పెళ్లికి ముందే ఎందుకు అంత తొందర? శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×