E-Paper
Advertisement

Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిన ఈ ప్రక్రియను చూస్తుంటే రాజకీయాల పట్ల విరక్తి కలుగుతోందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చూడని దారుణాలను ఇప్పుడు చూస్తున్నానని వాపోయారు.

రాజకీయ విరక్తి కలిగిస్తోంది.. ఎర్రబెల్లి

ఎన్నికల నిర్వహణ తీరుపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విపక్షాలను అణచివేస్తోందని విమర్శించారు. తొర్రూరులో ప్రజలు తమకు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అధికార బలంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రాజకీయ విభేదాలు ఉండేవని.. అయితే ఇంతటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం విప్ జారీ చేయాల్సిన తనను అక్రమంగా అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు.

అరెస్టుల పర్వంపై ఆగ్రహం

పోలీసుల తీరును తప్పుబడుతూ తనను తన భార్యను ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలోని కార్యాలయానికి వెళ్లే హక్కు కూడా తనకు లేదా అని నిలదీశారు. తనను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అప్రజాస్వామికంగా నిర్వహించారని ఆవేదన చెందారు. ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తూ సాగుతున్న ఇటువంటి కక్షసాధింపు చర్యలు రాష్ట్ర రాజకీయాలకు గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు.

ప్రలోభాలకు లొంగని కౌన్సిలర్లు

పాలక పక్షం ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారని ఎర్రబెల్లి ప్రశంసించారు. తమ అభ్యర్థులకు కోట్ల రూపాయల ఆశ చూపినా వారు లొంగలేదని స్పష్టం చేశారు. నీతి నిజాయితీలతో ఉన్న తమను అధికార బలంతో ఓడించడం పిరికిపంద చర్య అని అభివర్ణించారు. కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం.. ప్రలోభ పెట్టడం వంటి చర్యలు అత్యంత హేయమని పేర్కొన్నారు.

ALSO READ: KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు.. ఆయన సేవలు చిరస్మరణీయం

కంటతడి పెట్టిన మాజీ మంత్రి

ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతున్న సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఇటువంటి కుటిల రాజకీయాలు చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ప్రజలు తమ పక్షాన ఉన్నా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగాలా లేక తప్పుకోవాలా అనే ఆలోచన కూడా వస్తోందని తన మనోవేదనను పంచుకున్నారు.

ALSO READ: Telangana: ఢిల్లీకి తెలంగాణ సర్కార్.. హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రుల బృందం కీలక భేటీ!

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×