BSNL 72 Day Plan| ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ కొత్త సూపర్ వాల్యూ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ లాంగ్ వాలిడిటీతో పాటు ఎన్నో ఉపయోగకరమైన ఉచిత బెనిఫిట్స్ ఇస్తుంది. ప్రీమియం మొబైల్ బెనిఫిట్స్ తక్కువ ధరలో కావాల్సిన యూజర్ల కోసమే బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. రోజువారీ బెనిఫిట్స్ చాలా తక్కువ ధరలో లభిస్తాయి. ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చితే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. కాలింగ్, డేటా కలిపి కావాల్సినవారికి ఈ ప్లాన్ సరిపోతుంది.
బిఎస్ఎన్ఎల్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ఈ ప్లాన్ వివరాలు షేర్ చేసుకుంది. బిఎస్ఎన్ఎల్ కర్ణాటక సర్కిల్ ప్రకారం.. ఈ ప్లాన్ దాదాపు 72 రోజుల వాలిడిటీ ఇస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ధర కేవలం రూ.485. అంటే రోజుకు సుమారు రూ.7 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి చౌక ఆప్షన్లలో ఒకటి. రోమింగ్ కూడా ఫ్రీ కావడంతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపయోగించవచ్చు.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్లో భారతదేశం అంతటా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంది. ఏ నెట్వర్క్కైనా అదనపు ఛార్జీ లేకుండా కాల్స్ చేయవచ్చు. ఉచిత నేషనల్ రోమింగ్ కూడా లభిస్తుంది. ఏ రాష్ట్రానికి వెళ్లినా రోమింగ్ ఆందోళన లేకుండా ఉపయోగించవచ్చు. తరచూ ప్రయాణించేవారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఇది చాలా ఉపయోగకరం.
ఈ రీఛార్జ్ ప్లాన్లో రోజువారీ మొబైల్ ఇంటర్నెట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్కు సరిపోతుంది. రోజువారీ డేటా ముగిసిన తర్వాత స్పీడ్ తగ్గుతుంది. ప్రతిరోజూ 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. మెసేజ్ల ద్వారా కనెక్ట్ అవ్వడం సులభం. ఇతర టెలికాం కంపెనీల్లో ఇంత తక్కువ ధరలో ఇన్ని బెనిఫిట్స్ లేవు.
ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలో ప్లాన్ల ద్వారా బిఎస్ఎన్ఎల్ కొత్త యూజర్లను ఆకర్షిస్తోంది. ట్రాయ్ డేటా ప్రకారం ఇటీవల బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో లక్షలాది యూజర్లు చేరారు. తక్కువ ధరలు, లాంగ్ వాలిడిటీ ప్లాన్లు దీనికి కారణం. ప్రైవేట్ టెలికాం టారిఫ్లు పెరగడంతో చాలామంది బిఎస్ఎన్ఎల్కు మారుతున్నారు. వాల్యూ బేస్డ్ ప్రీపెయిడ్ ఆప్షన్లపై ఫోకస్ చేస్తోంది.
Also Read: బిఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ లిమిటెడ్ ఆఫర్.. ఈ రిఛార్జ్ ప్లాన్స్పై ఎక్స్ట్రా డేటా.. త్వరపడండి
బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరిస్తోంది. ఒక లక్ష కొత్త 4జీ టవర్లు ఇన్స్టాల్ చేశారు. ఇవి పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారయ్యాయి. భవిష్యత్తులో 5G అప్గ్రేడ్కు సపోర్ట్ చేస్తాయి. త్వరలో 5జీ సేవలు లాంచ్ చేయనుంది. ఢిల్లీ, ముంబై సర్కిల్స్లో ముందుగా రావచ్చు.
బిఎస్ఎన్ఎల్ ఇంకా వార్షిక రీఛార్జ్ ప్లాన్ కూడా ఆఫర్ చేస్తోంది. కేవలం రూ.2,399కు 365 రోజుల వాలిడిటీ ఇస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్, రోజుకు 100 SMSలు, 2GB డేటా లభిస్తాయి.