Fake iPhone Scam| దేశంలో నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు సాగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్రాష్ట్రంలోని సహారన్పూర్ నగరంలో ఒక భారీ ఐఫోన్ మోసం బయటపడింది. నెహ్రూ మార్కెట్లో ఉన్న “గీతాంజలి ఎంటర్ప్రైజెస్” అనే షాప్ నుంచి 100 మందికి పైగా కస్టమర్లు ఐఫోన్లు కొనుగోలు చేశారు. కానీ కొన్ని రోజుల తరువాత అన్ని ఫోన్లు ఒకేసారి పనిచేయడం మానేశాయి. ఫోన్ ఆన్ కావడం లేదు, రీస్టార్ట్ అవుతూ ఆగిపోతోందని కస్టమర్లు వాపోతున్నారు. ఫోన్ పేమెంట్ పూర్తిగా చేసినా షాప్ ఓనర్ బాధ్యత తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.
షాప్ ఓనర్ “ఈజీ EMI” పేరుతో చాలా తక్కువ డౌన్ పేమెంట్కే ఐఫోన్ 14, 15 మోడల్స్ ఇస్తామంటూ ఆకర్షణీయ ఆఫర్లు పెట్టారు. కస్టమర్లు ఈ స్పెషల్ ఆఫర్ చూసి తక్కువ ధరకే ఐఫోన్ కొనుగోలు చేశారు. కానీ 3 -4 రోజులకే ఫోన్ ఆటోమాటిక్గా రీసెట్ అయి షట్డౌన్ అయిపోయింది. మళ్లీ ఆన్ చేసినా పనిచేయడం లేదు. నిజానికి ఈ ఫోన్లన్నీ పాతవి, రిఫర్బిష్డ్ (మళ్లీ రిపేర్ చేసినవి) అని తెలిసింది. కొత్తవిగా చూపించి మోసం చేశారు. అందులోనూ ఈ ఫోన్ లోని భాగాలు నకిలీవి.
కస్టమర్లు కోపంతో షాప్ ముందు గుమిగూడి నిరసన తెలిపారు. అనంతరం అందరూ కలిసి సహారన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బాధితుల ఫిర్యాదు ప్రకారం.. షాప్ ఓనర్ తన బాధ్యత లేదంటూ తప్పించుకుంటున్నాడు. పైగా ఫోన్ రిపేర్ల కోసం రూ.2,000 నుంచి రూ.3,000 అవుతుందని కస్టమర్లు మరింత చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ముందు అందరూ EMI పేమెంట్ చేయాలని అప్పుడే రిపేర్ అవుతాయని బెదిరించాడు. ఈఎంఐలు చెల్లించిన వారికి ఐఫోన్స్ తాత్కాలికంగా రీసెట్ చేసి ఇచ్చాడు – కానీ మళ్లీ కొద్ది రోజుల్లోనే అవి డెడ్ అయిపోయాయి.
చవక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు చూపించి మోసం చేసే లోకల్ షాపుల నుంచి ఫోన్లు కొనుగోలు చేయడం మానండి. మీ కష్టార్జితం డబ్బు సేఫ్గా ఉండాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.
Also Read: ఐఫోన్ పోగొట్టుకున్నారా? లేదా చోరీ అయిందా? ఆపిల్ కొత్త ఐఫోన్ ఇస్తోంది.. వారికి మాత్రమే