E-Paper
Advertisement

Mercedes Benz : బెంజ్ కార్ ప్రియులకు షాక్… డిసెంబర్ వరకే ఛాన్స్

Mercedes Benz : బెంజ్ కార్ ప్రియులకు షాక్… డిసెంబర్ వరకే ఛాన్స్
Advertisement

Mercedes Benz : జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగ్జరీ వాహన ప్రియుల కోసం సరికొత్త డిజైన్, భద్రత ఫీచర్లు ఉన్న విలాసవంతమైన కార్లను మార్కెట్​లలోకి విడుదల చేస్తుంటుంది. అలానే భారత్‌లోని చిన్న నగరాల్లో కూడా తన ఉనికిని విస్తరించుకోవడానికి గత కొద్ది నెలలుగా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే భవిష్యత్​లో చిన్న నగరాల్లోనూ లగ్జరీ మోడళ్లకు డిమాండ్‌ పెరుగుతుందని సందరు సంస్థ భావిస్తోంది. అందుకే పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి, సేవా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ముందుకెళ్తోంది.

అయితే​ ఈ క్రమంలోనే మెర్సిడెస్​ బెంజ్ వాహన ప్రియులకు షాకిచ్చింది! ప్రస్తుతం తమ కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. తమ సంస్థకు చెందిన అన్నీ మోడల్ కార్ల ధరల్ని 3 శాతం వరకు పెంచనున్నట్లు తాజాగా అధికారికంగా అనౌన్స్ చేసింది. 2025 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు స్పష్టత ఇచ్చింది. అయితే డిసెంబర్‌ 31 లోపు తమ లగ్జరీ కార్లను బుకింగ్‌ చేసుకునే వారికి ఈ పెంపు వర్తించదని క్లారిటీ ఇచ్చింది. అంటే ఈ లెక్కన బెంజ్​ కార్ల ధరలు కనిష్ఠంగా రూ. 2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి బెంజ్ కార్ ప్రియులకు ఇది షాకింగ్ వార్తనే చెప్పాలి.

Advertisement

తమ సంస్థకు చెందిన కార్ల ధరల పెంపుదల ఎందుకు చేస్తున్నట్లో కూడా వివరించింది మెర్సిడెస్​. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. “ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో హెచ్చు తగ్గుల కారణంగా ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం. ఈ హెచ్చు తగ్గుల కారణంగా వ్యాపార కార్యకలాపాలపై భారీ ఒత్తిడి పెరుగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంచి పరిశీలిస్తే కంపెనీ నిర్వహణ వ్యయం కూడా బాగా పెరుగుతోంది. అందుకే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని మెర్సిడెస్‌ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వీటి సేల్స్ పెరుగుతున్నాయని.. వాటికి అనుగుణంగానే ధరలు కూడా పెంచాల్సి వస్తుందని తెలిపారు.

Mercedes Benz Indian Sales : కాగా, మెర్సిడెస్‌ బెంజ్‌ ప్రస్తుతం రూ. 45 లక్షలు విలువైన ఏ క్లాస్‌ కార్ల నుంచి రూ. 3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు అనేక రకాల మోడళ్లను దేశీయంగా విక్రయిస్తోంది. అలానే ఈ లగ్జరీ కార్ల విక్రయాలు భారత్‌లో గణనీయంగా పెరిగినట్లు గత నెల అక్టోబర్​లో రిపోర్ట్ వచ్చింది. 2024 సంవత్సరంలో మొదటి 9 నెలల(జనవరి-సెప్టెంబర్‌) కాల వ్యవధిలో 13% వృద్ధితో 14,379 కార్లను విక్రయించినట్లు తెలిసింది.

Advertisement

Mercedes Benz Recently Launched Car : ఇకపోతే రీసెంట్​గానే మెర్సిడెస్​ బెంజ్​ ‘ఏఎంజీ సీ 63 ఎస్‌ ఈ పెర్ఫార్మెన్స్‌’ కారును మార్కెట్​లోకి రిలీజ్​ చేసింది. ఎఫ్‌1 హైబ్రిడ్‌ టెక్నాలజీతో దీనిని రూపొందించింది. ఈ కారు ధర రూ. 1.95 కోట్లు. 2024లో మెర్సిడెస్​ కంపెనీ నుంచి వచ్చిన 24వ మోడల్‌ ఇది. ఈ విలాసవంతమైన కారు గంటకు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే అందుకుంటుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×