E-Paper
Advertisement

మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. తగ్గనున్న రీఛార్జ్ భారం!

మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. తగ్గనున్న రీఛార్జ్ భారం!
Advertisement

Recharge Prices: ప్రస్తుతం పెరిగిన మొబైల్ టారిఫ్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఇది వరకు రోజులతో పోలీస్తే అది సామాన్యులకు తలకు మించిన భారం అవుతోంది. అయితే, త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు వినియోగదారులకు ఊరటనివ్వనున్నాయి.

Read also-మిడిల్ క్లాస్ ఇష్టపడే ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ కార్లు ఇవే.. ఫీచర్లు పిచ్చెక్కిస్తాయి..

ధరలు తగ్గే అవకాశం

కేవలం వాయిస్ కాలింగ్ ప్లాన్లు (Voice-Only Plans)

Advertisement

ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు డేటా కాలింగ్ కలిపి ఉన్న ప్లాన్లనే విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ అవసరం లేని సాధారణ ఫోన్ వినియోగదారులు (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు, వృద్ధులు) కూడా అనవసరంగా డేటా కోసం అదనపు ఖర్చు చేయాల్సి వస్తోంది. TRAI ఇప్పుడు కేవలం ‘వాయిస్ కాలింగ్’ మాత్రమే ఉండే చౌకైన ప్లాన్లను ప్రవేశపెట్టాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది.

ఎంట్రీ-లెవల్ ప్లాన్ల ధరల తగ్గింపు

గత ఏడాది జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీనిపై సామాన్యుల నుండి తీవ్ర అసహనం వ్యక్తమైంది. కనీస రీఛార్జ్ ధరలు పెరగడంతో లక్షలాది మంది వినియోగదారులు తమ సిమ్ కార్డులను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా బేసిక్ రీఛార్జ్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement

Read also-రైలు సీటు దగ్గరికే ఫుడ్ డెలివరీ.. ixigo, Swiggy కొత్త సర్వీస్ షురూ!

వాలిడిటీ ప్లాన్లలో

సాధారణంగా నెల రీఛార్జ్ అంటే 28 రోజులే ఉండటంపై వినియోగదారుల్లో అసంతృప్తి ఉంది. దీనిని సరిదిద్ది, పూర్తి 30 రోజుల వాలిడిటీతో పాటు, సరసమైన ధరలకే లాంగ్-టర్మ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది.

ఎవరికి లాభం?

సాధారణ ఫోన్ వినియోగదారులు కీప్యాడ్ ఫోన్లు వాడుతూ కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే మొబైల్ వాడే వారికి ఇది పెద్ద ఊరట. వైఫై అందుబాటులో ఉండి మొబైల్ డేటా అవసరం లేని వారికి తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్లు దొరుకుతాయి. రీఛార్జ్ ఖర్చుల భారం తగ్గడం వల్ల నెలకు కొంత పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. టెలికాం రంగంలో పోటీ పెరగడం ప్రభుత్వ నియంత్రణ సంస్థల జోక్యంతో త్వరలోనే కంపెనీలు కొత్త టారిఫ్ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమలైతే, మొబైల్ రీఛార్జ్ అనేది విలాసంగా కాకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే అవసరంగా మారుతుంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×