Bharat Taxi UPI| ప్రభుత్వం కొత్తగా లాంచ్ చేసిన భారత్ టాక్సీతో యుపిఐ పేమెంట్ కంపెనీ పేటిఎం కొత్త ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్ టాక్సీ యాప్లో ప్రయాణికులు సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా రైడ్ ఛార్జీలు చెల్లించవచ్చు. ప్రయాణ చెల్లింపులని వేగంగా, సురక్షితంగా, పూర్తిగా డిజిటల్గా ఈ విధానం మారుస్తుంది. పేటీఎం తన పూర్తి పేమెంట్ సిస్టమ్ని భారత్ టాక్సీ యాప్లో ఇంటిగ్రేట్ చేస్తోంది.
పేటీఎం యూపీఐ, పేటీఎం QR కోడ్స్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్లు వంటి టూల్స్ భారత్ టాక్సీలో ఉపయోగపడతాయి. డ్రైవర్లు వివిధ నగరాల్లో సులభంగా పేమెంట్స్ అంగీకరించవచ్చు. క్యాష్ ఆధారిత పేమెంట్స్ తగ్గి, పేమెంట్ రిస్క్లు తగ్గుతాయి. ఇది డ్రైవర్లు, ప్రయాణికులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ఈ ఒప్పందం డ్రైవర్లను డిజిటల్ పేమెంట్స్ వైపు ఆకర్షిస్తుంది. భారత్ టాక్సీ డ్రైవర్లకు పేటీఎం.. యూపీఐ ఆన్బోర్డింగ్ సపోర్ట్ ఇస్తుంది. డ్రైవర్లు రైడ్ డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి పొందవచ్చు. క్యాష్ లేదా మాన్యువల్ ట్రాన్సాక్షన్లు అవసరం లేదు. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సులభంగా లభిస్తాయి. ఆదాయం, సేవింగ్స్, ఖర్చులు మెరుగ్గా మేనేజ్ చేయవచ్చు.
భారత్ టాక్సీ 5 ఫిబ్రవరి 2026న అధికారికంగా లాంచ్ అయింది. అమిత్ షా ఈ లాంచ్ చేశారు. ఇది సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే కోఆపరేటివ్ మోడల్ విధానంలో నడుస్తుంది. భారతదేశంలో మొదటి కోఆపరేటివ్ ఓనర్షిప్ రైడ్-హైలింగ్ సర్వీస్ ఇది. డ్రైవర్లు సర్వీస్ ప్రొవైడర్లు కాకుండా ఓనర్లుగా ఉంటారు. ఆదాయం, పని పరిస్థితుల మీద ఎక్కువ కంట్రోల్ వస్తుంది.
భారత్ టాక్సీ కమిషన్-ఫ్రీ మోడల్ని అనుసరిస్తుంది. డ్రైవర్ ఆదాయం నుంచి ఒక్క శాతం కూడా కట్ చేయదు. డ్రైవర్లు ఎక్కువ డబ్బు తమ దగ్గరే ఉంచుకోవచ్చు. ప్రయాణికులకు ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ ఉంటుంది. సర్జ్ ప్రైసింగ్ లేదు, హిడెన్ ఫీస్ లేవు. ఇది డ్రైవర్లు, యూజర్ల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది.
భారత్ టాక్సీ ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో మొదలైంది. రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్. పెద్ద నగరాలు, చిన్న పట్టణాలను కవర్ చేస్తుంది. ఇది డ్రైవర్లకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, ప్రయాణికులకు సరసమైన ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది.
Also Read: లాయర్, అకౌంటెంట్, మేనేజర్ లాంటి ఉద్యోగాలు ఇక ఉండవు.. మరో ఏడాదిలో అన్నీ మాయం
భారత్ టాక్సీ ఉబర్, ఓలా, రాపిడో వంటి ప్లాట్ఫామ్లతో పోటీ పడుతుంది. ఈ కంపెనీలు ఎక్కువ కమిషన్లు, సర్జ్ ప్రైసింగ్ వసూలు చేస్తాయి. భారత్ టాక్సీ డ్రైవర్-ఫ్రెండ్లీ ఆప్షన్ ఇస్తుంది. ఆర్థిక ఒత్తిడి లేకుండా సరైన ఆదాయం ఇస్తుంది.
ఈ ఒప్పందం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశం క్యాష్లెస్ ఎకానమీ వైపు వెళ్లడానికి సహాయపడుతుంది. ప్రయాణికులకు సురక్షిత, వేగవంతమైన పేమెంట్స్ వస్తాయి. డ్రైవర్లకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ, స్వాతంత్ర్యం లభిస్తుంది. పేటీఎం ఇంటిగ్రేషన్ భారత్ టాక్సీ ఎకోసిస్టమ్ని మరింత బలపరుస్తుంది.