E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Telegram మళ్లీ వచ్చేసింది.. కానీ, ఇలా చేస్తేనే పని చేస్తాది!

Telegram మళ్లీ వచ్చేసింది.. కానీ, ఇలా చేస్తేనే పని చేస్తాది!
Advertisement

Telegram: భారతదేశంలో టెలిగ్రామ్ వినియోగదారులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఈ మెసేజింగ్ యాప్‌పై ఉన్న తాత్కాలిక ఆంక్షలను ప్రభుత్వం క్రమంగా తొలగిస్తోంది. దీంతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో టెలిగ్రామ్ యాప్ మళ్లీ ప్రత్యక్షమైంది. చాలామంది యూజర్లకు సందేశాలు యథావిధిగా డెలివరీ అవుతున్నాయి. అయితే, ఆంక్షలు తొలగినప్పటికీ కొంతమందికి ఇంకా యాప్ సరిగ్గా పని చేయడం లేదు. అలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

యాప్ స్టోర్లలోకి టెలిగ్రామ్ రీఎంట్రీ:

నిషేధం కారణంగా గత కొన్ని రోజులుగా కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికీ, లేదా రీఇన్‌స్టాల్ చేయడానికీ వీలు లేకుండా పోయింది. దీనివల్ల యూజర్లు తీవ్ర ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. యాప్ స్టోర్లతో పాటు టెలిగ్రామ్ అధికారిక వెబ్‌సైట్ కూడా ఇప్పుడు భారత్‌లో సాధారణంగా పనిచేస్తోంది. డిజిటల్ సర్వీసులు మళ్లీ మునుపటిలా అందుబాటులోకి వస్తుండటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Advertisement

Also Read: రూ.లక్షన్నర పెట్టి Vivo X Fold 6 కొనాలా? 7000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అంతలా ఏముంది?

మెసేజ్‌లు వెళ్లడం లేదా?

ఆంక్షలు ఎత్తేసినా మీ ఫోన్‌లో టెలిగ్రామ్ చాట్స్ ఓపెన్ కాకపోయినా లేదా మెసేజ్‌లు వెళ్లకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. యాప్‌ను ఒకసారి అప్‌డేట్ చేసి, రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారైతే ప్లే స్టోర్‌కి వెళ్లి యాప్‌ను అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోని Apps విభాగంలోకి వెళ్లి టెలిగ్రామ్‌ను సెలెక్ట్ చేసి Force Stop చేయాలి. ఇప్పుడు యాప్‌ను మళ్లీ ఓపెన్ చేస్తే సర్వర్లతో కొత్త కనెక్షన్ ఏర్పడి యాప్ సజావుగా పనిచేస్తుంది. ఐఫోన్ వినియోగదారులు కూడా యాప్ స్టోర్‌లో అప్‌డేట్ చేసుకుని, యాప్ స్విచర్ ద్వారా యాప్‌ను పూర్తిగా క్లోజ్ చేసి మళ్లీ ఓపెన్ చేస్తే సరిపోతుంది.

ఆంక్షలు ఎందుకు విధించారంటే?

Advertisement

ఇటీవల దేశంలో జరిగిన NEET-UG రీ-ఎగ్జామినేషన్ సమయంలో పరీక్షకు సంబంధించిన కీలక సమాచారం లేదా ప్రశ్నపత్రాలు టెలిగ్రామ్ ద్వారా లీక్ అయ్యే అవకాశం ఉందనే అనుమానంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష ప్రక్రియ పారదర్శకంగా జరగడం కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను టెలిగ్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. ఆ పరీక్షల కాలం ముగియడంతో ఇప్పుడు ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నారు.

ఆ ఫీచర్ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే:

యాప్ సేవలు పునరుద్ధరణ అవుతున్నప్పటికీ.. టెలిగ్రామ్‌లోని Message Editing ఫీచర్‌పై ఉన్న పరిమితి మాత్రం ఇంకా కొనసాగుతోంది. మునుపటి ఆదేశాల ప్రకారం జూన్ 30 వరకు యూజర్లు తాము పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి వీలుండదు. ఈ ఒక్క ఫీచర్ మినహా మిగిలిన చాటింగ్, కాలింగ్ సేవలు త్వరలోనే అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

Also Read: మీ WhatsApp హ్యాక్ అయిందా? ఢిల్లీ పోలీస్ చెప్పిన ఈ సీక్రెట్ కోడ్‌తో క్షణాల్లో రికవరీ చేయొచ్చు!

Related News

ఇయర్‌‌బడ్స్ vs ఇయర్‌‌ఫోన్స్ vs హెడ్‌ఫోన్స్.. ఈ మూడింట్లో ఏది బెస్ట్?

బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్.. Samsung Galaxy M47 5G ఫీచర్లు చూశారా?

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? బ్యాక్ గ్రౌండ్ నాయిస్ రాకుండా చేసే.. హెడ్‌ఫోన్స్!

హార్డ్ వర్క్ వద్దు.. స్మార్ట్ వర్క్ ముద్దు.. ఈ యాప్స్‌తో ఆఫీసు వర్క్ సూపర్ ఈజీ!

రూ.లక్షన్నర పెట్టి Vivo X Fold 6 కొనాలా? 7000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అంతలా ఏముంది?

మీ WhatsApp హ్యాక్ అయిందా? ఢిల్లీ పోలీస్ చెప్పిన ఈ సీక్రెట్ కోడ్‌తో క్షణాల్లో రికవరీ చేయొచ్చు!

భారత్‌లో boAt Airdopes ProClip లాంచ్.. తక్కువ ధరలో ప్రైవసీకి పక్కా గ్యారెంటీ!

Big Stories

×