E-Paper
Advertisement

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?
Advertisement

Zoom Meeting: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహారీజ్ గంజ్ జిల్లాలో విద్యాశాఖ నిర్వహించిన జూమ్ సమావేశం ఓ అనూహ్య ఘటన వల్ల అస్తవ్యస్తంగా మారింది. ఐదు రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్ నిర్వహించిన సమావేశంలో చాలా మంది అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డారు. అందులో ఓ వ్యక్తి ముందుగా ఆన్ లైన్‌లో అశ్లీల వీడియోను ప్లే చేశాడు. అనంతరం వెంటనే మరో వ్యక్తి అసభ్యకరమైప పదజాలంతో దూషించాడు. దీంతో ఆ జూమ్ మీటింగ్ అస్తవ్యస్తంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆగస్టు 7న జూమ్ ద్వారా విద్యాశాఖ ఈ-చౌపాల్ సమావేశం నిర్వహించింది. ఈ జూమ్ సమావేశానికి జిల్లా మేజిస్ట్రేట్ సంతోష్ కుమార్ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కామన్ పీపుల్ కూడా పాల్గొన్నారు. పాఠశాల సంబంధిత సమస్యలపై ప్రజలు నేరుగా జిల్లా మేజిస్ట్రేట్‌తో సంప్రదించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశం జరుగుతుండగా.. మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలను ప్లే చేశారు.

Advertisement

ALSO READ: Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

జూమ్ మీటింగ్ కొనసాగుతుండగా.. జాసన్ జూనియర్ అనే పేరుతో ఓ వ్యక్తి అశ్లీల వీడియోలను ప్లే చేశాడు. అదే సమంలో అర్జున్ పేరుతో ఉన్న మరో వ్యక్తి బూతు పదజాలం వాడాడు. దీంతో వెంటనే విద్యాధికారులు, టీచర్లు సమావేశం నుంచి నిష్క్రమించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిద్ధి పాండే పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు అజ్ఞాత వ్యక్తులపై కోత్వాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

సదర్ కోత్వాలీ పోలీస్ అధికారి సత్యేంద్ర రాయ్ ఈ సంఘటన గురించి మాట్లాడారు. ఈ సంఘటనపై సైబర్ పోలీసుల సహాయంతో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఆ ఇద్దరి నిందితులను టెక్నికల్ మార్గాల ద్వారా గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వారి ఇద్దరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.. ఈ ఘటన విద్యాశాఖ సమావేశాల ఆన్‌లైన్ వేదికల భద్రతపై పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత కఠినమైన సైబర్ భద్రతా చర్యలు అవసరమని అధికారులు, నెటిజన్లు భావిస్తున్నారు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×