E-Paper
Advertisement

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Zoom Meeting: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహారీజ్ గంజ్ జిల్లాలో విద్యాశాఖ నిర్వహించిన జూమ్ సమావేశం ఓ అనూహ్య ఘటన వల్ల అస్తవ్యస్తంగా మారింది. ఐదు రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్ నిర్వహించిన సమావేశంలో చాలా మంది అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డారు. అందులో ఓ వ్యక్తి ముందుగా ఆన్ లైన్‌లో అశ్లీల వీడియోను ప్లే చేశాడు. అనంతరం వెంటనే మరో వ్యక్తి అసభ్యకరమైప పదజాలంతో దూషించాడు. దీంతో ఆ జూమ్ మీటింగ్ అస్తవ్యస్తంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆగస్టు 7న జూమ్ ద్వారా విద్యాశాఖ ఈ-చౌపాల్ సమావేశం నిర్వహించింది. ఈ జూమ్ సమావేశానికి జిల్లా మేజిస్ట్రేట్ సంతోష్ కుమార్ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కామన్ పీపుల్ కూడా పాల్గొన్నారు. పాఠశాల సంబంధిత సమస్యలపై ప్రజలు నేరుగా జిల్లా మేజిస్ట్రేట్‌తో సంప్రదించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశం జరుగుతుండగా.. మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలను ప్లే చేశారు.

ALSO READ: Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

జూమ్ మీటింగ్ కొనసాగుతుండగా.. జాసన్ జూనియర్ అనే పేరుతో ఓ వ్యక్తి అశ్లీల వీడియోలను ప్లే చేశాడు. అదే సమంలో అర్జున్ పేరుతో ఉన్న మరో వ్యక్తి బూతు పదజాలం వాడాడు. దీంతో వెంటనే విద్యాధికారులు, టీచర్లు సమావేశం నుంచి నిష్క్రమించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిద్ధి పాండే పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు అజ్ఞాత వ్యక్తులపై కోత్వాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

సదర్ కోత్వాలీ పోలీస్ అధికారి సత్యేంద్ర రాయ్ ఈ సంఘటన గురించి మాట్లాడారు. ఈ సంఘటనపై సైబర్ పోలీసుల సహాయంతో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఆ ఇద్దరి నిందితులను టెక్నికల్ మార్గాల ద్వారా గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వారి ఇద్దరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.. ఈ ఘటన విద్యాశాఖ సమావేశాల ఆన్‌లైన్ వేదికల భద్రతపై పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత కఠినమైన సైబర్ భద్రతా చర్యలు అవసరమని అధికారులు, నెటిజన్లు భావిస్తున్నారు.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×