Umpire dies: క్రికెట్ చరిత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి ( Umpire dies) చెందారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో జరిగింది. తేనెటీగల దాడిలో ( bee attack ) అంపైర్ ( Umpire) మృతి చెందిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. మ్యాచ్ జరిగే సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా అటాక్ చేసింది. అయితే అందరూ అలర్ట్ అయ్యేలోపు.. తేనెటీగలు దాడి చేసేసాయి. అయితే ఈ సంఘటనలో ఫీల్డ్ అంపైర్ మాణిక్ గుప్తా ( umpire Manik Gupta ) మరణించినట్లు చెబుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. 20 మంది యువ క్రికెటర్లు గాయపడ్డారట.
క్రికెట్ చరిత్రలో ఎన్నడు జరగని విషాద సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో ఫీల్డ్ అంపైర్ మాణిక్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందారు. 65 సంవత్సరాల అంపైర్ మాణిక్ గుప్తా ( Manik Guptha) మృతి చెందారు. ఉన్నావ్ జిల్లాలోని శుక్లా గంజి ఏరియాలో ఉన్న సప్రూ మైదానంలో… ఈ దారుణమైన సంఘటన జరిగింది. అండర్ 13 విభాగంలో భాగంగా.. జరిగిన మ్యాచ్ సందర్భంగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. స్టేడియం పక్కనే ఓ మర్రి చెట్టు ఉందట. ఆ మర్రి చట్టుకు చాలా తేనెటీగలు ( Bees) ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాలి ఒకసారి గా వీచడంతో… తేనె టీగలు ( Bees) దాడి చేసినట్లు చెబుతున్నారు స్థానికులు.
ఈ సందర్భంగా అంపైర్ మాణిక్ గుప్తాపై మొదట తేనె టీగలు దాడి చేసినట్లు చెబుతున్నారు. అతనితో పాటు దాదాపు స్టేడియం దగ్గర ఉన్న 150 మంది పైన ఈ తేనెటీగలు దాడి తెలిసినట్లు స్థానికులు స్పష్టం చేస్తున్నారు. దాడి జరిగిన తర్వాత అపైర్ మాణిక్ గుప్తాను శుక్లాగంజ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారట. ఆ తర్వాత కాన్పూర్ లోని ( kanpur) పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.
కానీ అప్పటికే ఆయన పరిస్థితి విషమించడం.. మరణించడం చకచగా జరిగిపోయాయి. ఈ సంఘటన ఇప్పుడు క్రీడా లోకంలో పెనువిషధాన్ని నింపింది. అయితే ఈ తేనె టీగల దాడి ఈ సందర్భంగా జగదీశ్వర్ శర్మతో పాటు దాదాపు 20 మంది యువ క్రికెటర్లు గాయపడ్డారట. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అటు అంపైర్ మాణిక్ గుప్తా మృతి చెందిన నేపథ్యంలో కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని కూడా అధికారిక ప్రకటన చేసింది కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్.
A cricket umpire in Uttar Pradesh’s Kanpur died after a swarm of bees suddenly attacked him and several others at the ground during a match. Many people were injured in the incident and have been hospitalised.
The 65-year-old victim, Manik Gupta, who was associated with the… pic.twitter.com/43FXz06hHw
— IndiaToday (@IndiaToday) February 19, 2026