Surya Kumar Yadav Chewing Gums: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు దాదాపు 40% మ్యాచ్ లు పూర్తయ్యాయి. ప్రతి జట్టు ఐదుకు పైగా మ్యాచులు కూడా ఆడేశాయి. ఇక ఈ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అంబానీ ఫ్యామిలీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు చూయింగ్ గమ్ నమిలే సూర్యకుమార్ యాదవ్ కు ( Surya Kumar Yadav ) కోత పెట్టినట్లు చెబుతున్నారు.
చూయింగ్ గమ్ ల (Chewing Gum) స్థానంలో సెంటర్ ఫ్రెష్ (center fresh) నమలమని నీతా అంబానీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై చూయింగ్ గమ్ ఖర్చులు భరించబోమని.. సెంటర్ ఫ్రెష్ మాత్రమే అందిస్తామని కుండ బద్దలు కొట్టి చెప్పారట. దీంతో ఇకపైన చూయింగ్ గమ్ స్థానంలో సెంటర్ ఫ్రెష్ తినేందుకు సూర్య సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే సెంటర్ ఫ్రెష్ కంపెనీ ప్రోడక్ట్ కు సూర్య కుమార్ యాదవ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కాబోతున్నట్లు సెటైర్లు పేల్చుతున్నారు నెటిజెన్స్.
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ నిత్యం చూయింగ్ గమ్స్ నములుతాడన్న సంగతి తెలిసిందే. అయితే వీటికి అయ్యే ఖర్చు టీమిండియాలో అయితే బీసీసీఐ, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ భరిస్తుంది. ఒక చూయింగ్ గమ్ ధర 50 రూపాయలు అని తెలుస్తోంది. అంటే ఒక్కరోజులో 25 వేల రూపాయల ఖర్చు కేవలం సూర్య భాయ్ కోసం పెడుతున్నారు. ఏడాదికి 7.5 లక్షల ఖర్చు భారత క్రికెట్ నియంత్రణ మండలి చేస్తోంది. ఇక ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడిన రోజు కచ్చితంగా సూర్య కుమార్ యాదవ్ కోసం 25 వేల రూపాయలు ఖర్చవుతుంది.
ఈ ఖర్చు అంబానీ భరిస్తున్నాడు. ఇంత ఖర్చు పెడుతున్న కూడా సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా ఆడడం లేదు. ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా పెద్దగా లేదు. అందుకే ఈ చూయింగ్ గమ్ బంద్ చేసి… సెంటర్ ఫ్రెష్ వాడాలని ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ కు అంబానీ ఫ్యామిలీ నుంచి ఆదేశాలు వచ్చాయట. ఈ సెంటర్ ఫ్రెష్ కోసం ఒక్క రోజుకు రూ. 500 ఖర్చు చేస్తే సరిపోతుందని.. ఈ మేరకు సూర్య పై ఆంక్షలు వేసిందట అంబానీ ఫ్యామిలీ. దీంతో చేసేదేమీ లేక ఇకపైన సెంటర్ ఫ్రెష్ అలవాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడట.