Ameesha Patel: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. రోహిత్ శర్మ ఈనెల 19వ తేదీన చివరి వన్డే ఆడబోతున్నాడని… లార్డ్స్ లో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కావాలనే గౌతమ్ గంభీర్ ఒత్తిడి తీసుకువచ్చి… రోహిత్ శర్మతో రిటైర్మెంట్ ప్రకటించేలా చేస్తున్నాడని ఫ్యాన్స్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ అందాల తార అమీషా పటేల్ (Ameesha Patel) రియాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మను ( Rohit Sharma) బలవంతంగా రిటైర్మెంట్ చేసేలా గౌతమ్ గంభీర్ చేస్తున్నాడని మండిపడ్డారు. దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli ) పట్ల గౌతమ్ గంభీర్ అటు బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం బాగాలేదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రోహిత్ శర్మ ఎల్లుండి రిటైర్మెంట్ ప్రకటిస్తే… టీమిండియాను కుక్క కూడా దేకదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమీషా పటేల్.
లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వస్తున్న వార్తలపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ రియాక్ట్ అయ్యారు. భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ పట్ల బీసీసీఐ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గౌతమ్ గంభీర్ ఇస్తున్న తప్పుడు నివేదికల వల్ల, రోహిత్ శర్మ బలవంతంగా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. వరల్డ్ కప్ తీసుకువచ్చిన రోహిత్ శర్మకు ఇలా జరిగితే ? సామాన్య క్రికెటర్ కు టీమిండియాలో అవకాశం కూడా రాదన్నారు. క్రికెట్ చరిత్రలో ఇది క్రూరమైన చర్య అంటూ ఆగ్రహించారు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అభిమానులకు ఇది ఘోర అవమానం అన్నారు. ఇప్పటికైనా బీసీసీఐ, గౌతమ్ గంభీర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అంతేకాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో గంభీర్ జోక్యం చేసుకుంటే, పళ్లు రాలతాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తారన్న వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు లార్డ్స్ కు చేరుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ భార్య రితికా ఇంగ్లాండ్ లోనే ఉండగా.. తాజాగా ఆయన తల్లిదండ్రులు కూడా లార్డ్స్ చేరుకున్నారు. దీంతో లార్డ్స్ వేదికగా ఎల్లుండి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడం గ్యారంటీ అని చర్చ జరుగుతోంది.
Ameesha Patel calls out the treatment of Virat Kohli and Rohit Sharma in the current era of cricket, describing it as a “cruel cricketing era” 👀🏏#AmeeshaPatel #ViratKohli #RohitSharma #Insidesport #CricketTwitter pic.twitter.com/V2OOqi9VP3
— InsideSport (@InsideSportIND) July 17, 2026