Tanveer Ahmed: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మను 2027 వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఎల్లుండి ఇంగ్లాండ్ తో జరిగే లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మకు చివరిది అని అంటున్నారు. ఆ రోజున వన్డేలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడని చెబుతున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రియాక్ట్ అవుతున్నారు. గౌతమ్ గంభీర్ చెత్త నిర్ణయాల వల్లే రోహిత్ శర్మకు అన్యాయం జరుగుతోందని ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయి.. గౌతమ్ గంభీర్ కు కౌంటర్ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ కు కొంచెం కూడా బుర్రలేదని మండిపడ్డారు. రోహిత్ శర్మను కాదు.. ముందు గౌతమ్ గంభీర్ మెడలు పట్టుకొని గెంటేయండి అంటూ బీసీసీఐకి సూచనలు చేశారు. రోహిత్ శర్మ లేకపోతే 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా రాణించడం కష్టమేనన్నారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ రియాక్ట్ అయ్యారు. టీమిండియాలో సీనియర్ క్రికెటర్లు ఉంటేనే విజయాలు దక్కుతాయి అన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా రియంట్రీ ఇచ్చారు కాబట్టి వన్డేల్లో ఇంగ్లాండ్ పై విజయాలు సాధిస్తుందని టీమిండియాను ప్రశంసించారు.
అయితే 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడకుండా గౌతమ్ గంభీర్ కుట్రలకు తెరలేపాడు అని బాంబు పేల్చారు. బీసీసీఐకి పదే పదే గంభీర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే… రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై వెంటనే బీసీసీఐ మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే హర్షిత్ రాణాను కూడా వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ స్థానంలో టీమిండియా ఓపెనర్ గా గౌతమ్ గంభీర్ తయారు చేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇదే జరిగితే గ్రూప్ స్టేజ్ లో టీమిండియా ఇంటిదారి పడుతుందని హెచ్చరించారు.
లార్డ్స్ వేదికగా ఈనెల 19వ తేదీన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తూ ఆయన తల్లిదండ్రులు లార్డ్స్ కు చేరుకున్నారు. దీంతో 19వ తేదీన రోహిత్ శర్మ రిటైర్మెంట్ గ్యారంటీ అని అంటున్నారు.
🚨 GOOD NEWS FOR HARSHIT RANA 🚨
– Harshit Rana is part of Team India's plans for the 2027 ODI World Cup.
– Harshit Rana will be part of the 2027 ODI World Cup team. [News 18] pic.twitter.com/QQNiUoU4NP— lndian Sports Network (@IS_Netwrk29) July 16, 2026