Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 Trophy ) విజేతగా టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. తొమ్మిదో సారి ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా, ఇప్పటి వరకు కూడా ఆసియా కప్ 2025 ట్రోఫీని అందుకోలేదు. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియా, ఈ ట్రోఫీని తీసుకోకుండానే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేసింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ( Asian Cricket Council) చైర్మన్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాస్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ఉన్న నేపథ్యంలో ట్రోఫీ తీసుకోలేదు టీమిండియా. పాకిస్తాన్ వ్యక్తులు ఈ ట్రోఫీ ఇస్తే తాము తీసుకోబోమని, దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేసింది సూర్య కుమార్ సేన.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పూర్తయి నెల రోజులు అయిపోయింది అయినప్పటికీ ఇండియాకు మాత్రం ఆసియా కప్ 2025 ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ పంపించలేదు. సూర్య కుమార్ యాదవ్ ను తన ఆఫీసుకు పంపిస్తేనే, ట్రోఫీ ఇస్తానని మొహ్సిన్ నఖ్వీ కండిషన్ పెట్టాడు. దీంతో మొహ్సిన్ నఖ్వీపై ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆసియా కప్ 2025 ట్రోఫీ గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ACC ఆఫీసులో ఉండాల్సిన ఆసియా కప్ 2025 ట్రోఫీని, దొంగతనంగా మొహ్సిన్ నఖ్వీ తీసుకు వెళ్ళాడట. ఆ ట్రోఫీని అబుదాబిలోని రహస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎవరికీ చెప్పకుండానే మొహ్సిన్ నఖ్వీ ఈ పని చేశాడట. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) చాలా సీరియస్ అవుతోంది. తదుపరి చర్యలపై రివ్యూ నిర్వహించనుంది బీసీసీఐ.
🚨 BIG UPDATE ON ASIA CUP TROPHY 🚨
– Trophy has been removed from ACC office and locked in an abandoned place in Abu Dhabi by Mohsin Naqvi. (Vipul Kashyap/ANI). pic.twitter.com/ir6ntVJc4L
— Tanuj (@ImTanujSingh) October 24, 2025