E-Paper
Advertisement

Asia Cup 2025 jersey : టీమిండియా న్యూ జెర్సీ వచ్చేసింది… జెర్సీ లేకుండానే.. ఫోటోలు చూసేయండి

Asia Cup 2025 jersey : టీమిండియా న్యూ జెర్సీ వచ్చేసింది… జెర్సీ లేకుండానే.. ఫోటోలు చూసేయండి
Advertisement

Asia Cup 2025 jersey : భార‌త ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం తీసుకురావ‌డంతో డ్రీమ్ 11 టీమిండియా కి స్పాన్స‌ర్ షిప్ ర‌ద్దు చేసుకుంది. దీంతో కొత్త‌గా స్పాన్స‌ర్ షిప్ ఎవ్వ‌రూ వ‌హిస్తార‌ని సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపించాయి. కానీ ఎట్ట‌కేల‌కు టీమిండియా న్యూ జెర్సీ రిలీజ్ చేసింది. ముఖ్యంగా డ్రీమ్ 11తో స్పాన్స‌ర్ షిప్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఎలాంటి స్పాన్స‌ర్ లోగో లేకుండానే జెర్సీని రిలీజ్ చేశారు.ఈ టోర్నీ అనంత‌రం కొత్త స్పాన్స‌ర్ రానున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా జెర్సీ స్పాన్స‌ర్ చేసిన దాదాపు అన్ని కంపెనీలు కూడా దివాళ తీయ‌డంతో పాటు ఇంకేదో కేసులో ఇరుక్కోవ‌డం వంటివి జ‌రిగాయి. ఆసియా క‌ప్ 2025 కి స్పాన్స‌ర్ షిప్ లేకుండానే జెర్సీ రిలీజ్ చేయ‌డం విశేషం. డ్రీమ్ 11 ర‌ద్దు కావ‌డంతో చాలా న‌ష్టాలు ఎదుర్కొవాల్సి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. బీసీసీఐ కొత్త స్పాన్స‌ర్ షిప్ కోసం ఎప్పుడూ బిడ్ వేస్తుందో అనేది తెలియదు. త్వ‌ర‌లోనే బిడ్ వేయ‌నున్నట్టు తెలుస్తోంది. టీమిండియా స్పాన్స‌ర్ షిప్ లేకుండా ఉన్న జెర్సీ చూప‌ర్లను ఆక‌ట్టుకుంటోంది.

Also Read : Neymar Junior : రూ.10వేల కోట్ల ఆస్తి.. ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చేసిన బిలియనీర్‌

టీమిండియా కు నో స్పాన్స‌ర్

Advertisement

వాస్త‌వానికి ఆసియా క‌ప్ 2025 సెప్టెంబ‌ర్ 09న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే వాళ్లు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీసీసీఐ (BCCI) ఇటీవలే బ్రాంకో చెస్ట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. క్రికెటర్లకు ఈ టెస్ట్ చాలా ముఖ్యమని.. ఫిట్నెస్ పరంగా, హెల్త్ పరంగా బ్రాంకో టెస్ట్ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ప్రవేశపెట్టినట్టు ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే అందులో కొంద‌రూ ఆట‌గాళ్ల‌కే నిర్వ‌హించింది. మిగ‌తా ఆట‌గాళ్ల‌కు ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేద‌ని టాక్ వినిపిస్తోంది. ఆసియా క‌ప్ న‌కు బ్రాంకో టెస్ట్ ఫైన‌ల్ కాద‌ని స్ప‌ష్టంగా నిరూపితం అయింది. వ‌న్డే మ్యాచ్ ల‌కు మాత్రం ప‌క్కా నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం సూర్య‌కుమార్ యాద‌వ్ సారథ్యంలోని 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే యూఏఈకి చేరుకుంది. ప్రాక్టీస్ సెష‌న్ లో కూడా పాల్గొంది టీమిండియా. ఈ త‌రుణంలోనే శుబ్ మ‌న్ గిల్, శివ‌మ్ దూబే ధ‌రించిన జెర్సీల‌పై ఎలాంటి స్పాన్స‌ర్ షిప్ లోగో లేదు. దీంతో జ‌ట్టుకు ఎలాంటి స్పాన్స‌ర్ లేర‌ని అధికారికంగా తేలిపోయింది.

ఆ విధానాన్నే బీసీసీఐ అనుస‌రిస్తోంది

టీ-20 ఫార్మాట్ లో జ‌రుగ‌నున్న ఈ టోర్నీలో మొత్తం 8 జ‌ట్లు బ‌రిలోకి దిగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 09న ఈ టోర్నీ ప్రారంభం కానుండ‌గా.. భార‌త్ సెప్టెంబ‌ర్ 10న యూఏఈతో త‌ల‌ప‌డ‌నుంది. సెప్టెంబ‌ర్ 14న పాకిస్తాన్ జ‌ట్టుతో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ పై ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా ఆసియా క‌ప్ 2025లో అన్ని మ్యాచ్ లు ఆడుతుంద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా స్ప‌ష్టం చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌రువాత భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడవ‌ద్ద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ టీమిండియా-పాక్ మ్యాచ్ విష‌యంలో బీసీసీఐ పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ విధానాన్ని అనుస‌రిస్తుంద‌ని.. ఈ విష‌యంలో బోర్డుకు ఎలాంటి ఇబ్బంది లేద‌ని వెల్ల‌డించారు. పాకిస్తాన్ తో మ్యాచ్ విష‌యంలో బీసీసీఐ వైఖ‌రీ చాలా స్ప‌ష్టంగా ఉంద‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని.. భార‌త ప్ర‌భుత్వం ఒక విధానాన్ని రూపొందించిందని.. అదే విధానాన్ని అనుస‌రించ‌డంలో త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని వెల్ల‌డించారు.

Related News

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

Big Stories

Advertisement
×