E-Paper
Advertisement

RCB-Ananya Birla: ప్రీతీ జింటా, కావ్య పాప కంటే రిచ్‌… అనన్య బిర్లా ఆస్తులు ఎన్ని కోట్లంటే

RCB-Ananya Birla: ప్రీతీ జింటా, కావ్య పాప కంటే రిచ్‌… అనన్య బిర్లా ఆస్తులు ఎన్ని కోట్లంటే

RCB-Ananya Birla:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టుకు కొత్త ఓనర్ షిప్ వచ్చింది. ఆదిత్య బిర్లా గ్రూప్ తో పాటు మరో మూడు కంపెనీలు ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశాయి. రూ.16,700 కోట్లు పెట్టి మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదిత్య బిర్లా గ్రూప్ ఓనర్ కూతురు అనన్య బిర్లా (Ananya Birla) పేరు మారుమవుతోంది. బెంగళూరు జట్టుకు చైర్మన్ గా ఆర్యమాన్ బిర్లా ( Aryaman Birla) కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ… ఆ జట్టు పూర్తి బాధ్యతలు మాత్రం అనన్య బిర్లా చూసుకోబోతున్నారట. అచ్చం కావ్య పాప, ప్రీతీ జింటా తరహాలోనే బెంగళూరు జట్టును ప్రమోట్ చేయబోతున్నారు అనన్య బిర్లా ( ananya birla).

Also Read: Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

ప్రీతీ జింటా, కావ్య పాప‌ కంటే రిచ్ అనన్యనే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కుమార్‌ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా ఆస్తులు వైరల్ అవుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప, పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటాల కంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన అనన్య బిర్లా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ఆస్తులు రూ. 409 కోట్లు మాత్రమే. అటు పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ గా ఉన్న ప్రీతీ జింటా ఆస్తులు రూ. 183 కోట్లు మాత్రమే అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అనన్య బిర్లా ఆస్తులు మాత్రం వీళ్ళకంటే డబుల్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.1770 కోట్లతో అనన్య బిర్లా ముందంజలో ఉంది. ఇవి కేవలం ఆమె వ్యక్తిగతంగా సంపాదించుకున్నవి మాత్రమే అని తెలుస్తోంది. అంటే సొంతంగానే ఓ ఐపీఎల్ జ‌ట్టును కొనుగోలు చేయొచ్చు..లేదా కొత్త జ‌ట్టును మెంటేన్ చేసేంత ఆస్తులు ఆన‌న్య బిర్లా ద‌గ్గ‌ర ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్లు ఎవరంటే ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మొత్తం నాలుగు కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో మెజారిటీ షేర్లను ఆదిత్య బిర్లా గ్రూప్ కొనేసింది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్ స్టోన్ కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం రూ. 16,700 కోట్లు పెట్టి ఆర్సీబీ జట్టును కొనుగోలు చేశారు.

Also Read: Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

 

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×