Kohli-Anushka: క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరికీ సపరేట్ గా కోట్లాది సంఖ్యలో అభిమానులు అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. అనుష్క శర్మ తన సినిమాలతో బాలీవుడ్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విరాట్ కోహ్లీ తనదైన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో ఘనవిజయాలను అందించాడు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ ప్రస్తుతం లండన్ లో సెటిల్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాగా వీరిద్దరికి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లండన్ లో ఉంటున్న ఈ జంట ఆలీబాగ్ లో 5.1 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ స్థలంలో వీరు ఇల్లు కట్టుకుంటారా లేదా అనే సందేహంలో అభిమానులు ఉన్నారు.
Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవమానం..యూపీ కొంపముంచిన “రిటైర్ట్ ఔట్”
విరాట్, అనుష్క జంట ఆలీబాగ్ లో 5.1 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఈ భూమి కోసం ఏకంగా 38 కోట్లు కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్థలంలో వీరు ఇల్లు కట్టుకొని ఆలీబాగ్ లోనే ఉండాలని అనుకుంటున్నట్లుగా కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. లండన్ ను విడిచిపెట్టి ఇక్కడికే వచ్చి సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం తెలిసిన అనంతరం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. అయితే మ్యాచ్లు ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చేవాడు. మ్యాచ్ పూర్తయిన అనంతరం లండన్ కు తిరిగి వెళ్లేవారు. అయితే ఈ జంట లండన్ లో ఉండడానికి గల కారణం అక్కడ చాలా ప్రశాంతంగా ఉండవచ్చని ఎలాంటి గందరగోళం ఉండదని అనుకున్నారు. అభిమానుల హడావిడి లేకుండా బయటికి వెళితే లండన్ లో వారిని ఎవరు పెద్దగా గుర్తుపట్టరని ఈ నిర్ణయం తీసుకున్నారు. లండన్ లో ఏకాంతంగా బయట ప్రశాంతంగా తిరగడం కోసమే అనుష్క విరాట్ తమ పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆలీబాగ్ లో స్థలం కొనుగోలు చేయడంతో వీరు లండన్ ను వీడుతున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఈ జంట నిజంగానే లండన్ ను వదిలేసి ఇండియాకు వస్తే చాలా బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన ఏదో ఒక క్లారిటీ వస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.