Anushka – Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇవాళ చిన్నస్వామి స్టేడియం దగ్గర విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా… ఈ సందర్భంగా తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ లందరూ బస్సు పైన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీంతో వాళ్లను చూసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు అందరూ.. తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే… తీవ్రమైన తొక్కిసలాట జరిగి… ఏకంగా 18 మంది వరకు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది.
ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే
బెంగళూరు చిన్న స్వామి దగ్గర తొక్కిసలాట
చిన్నస్వామి స్టేడియం దగ్గర వేలాది సంఖ్యలో… రాయల్ చాలెంజెస్ బెంగళూరు అభిమానులు వచ్చారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. ఎక్కువ అభిమానులు వస్తారని ఊహించకపోవడంతో… భద్రత సిబ్బంది అక్కడ తక్కువగానే ఉంది. ఇంకేముంది.. ఎక్కువ అభిమానులు రావడంతో అక్కడ ఉన్న భద్రత సిబ్బంది చేతులెత్తేసింది. బారి కేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేయగా… అభిమానులు వాటిని తోసేస్తూ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. దీంతో దాదాపు 37 మంది ఆసుపత్రి పాలయ్యారు. సుమారు 18 మంది మృతి చెందారని తెలుస్తోంది. మరో 10 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతుంది.
18 మంది మృతి… కిస్సులు ఇస్తున్న కోహ్లీ, అనుష్క
చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి పెద్ద సంఖ్యలో రాయల్ చాలెంజర్స్ అభిమానులు మృతి చెందారు. ఇందులో అందరూ విరాట్ కోహ్లీ డై హార్ట్ ఫ్యాన్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో… తమ సంబరాలు తామే అన్నట్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్లు వ్యవహరించారు. స్టేడియం లోపల విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. కర్ణాటక ప్రభుత్వం… సన్మానిస్తుంటే… శవాలు…. కళ్ళముందే ఉన్నప్పటికీ.. సన్మానాన్ని ఎంజాయ్ చేశారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్లు. ఇక ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ దంపతులపై కూడా దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. అక్కడ అంత మంది చనిపోతే విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ఇద్దరు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్టేడియం లోపలికి వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులను చూస్తూ… ఫ్లైయింగ్ కిస్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ.
దీంతో ఈ ఇద్దరు దంపతుల పైన… నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శవాలగుట్ట ఉండగా ఇలాంటి ఎంజాయ్మెంట్ ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక చిన్న స్వామి దగ్గర తొక్కిసలాట జరగడంపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సిద్ధరామయ్య సర్కార్ తప్పిదం కారణంగానే ఈ సంఘటన జరిగిందని ఫైర్ అవుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా… ఈ మారణకాండ జరిగిందని బిజెపి నేతలు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. దీనికి పూర్తి బాధ్యత కర్ణాటక సర్కార్ వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ
Virat Kohli and Anushka Sharma giving flying kiss to fans at Chinnaswamy. ❤️ pic.twitter.com/IDgkUDV2AO
— Tanuj (@ImTanujSingh) June 4, 2025