E-Paper
Advertisement

Arshdeep singh : మహిళలను అవమానించిన అర్ష్ దీప్ సింగ్.. ఆ గొంతుతో ఇమిటేట్ చేస్తూ

Arshdeep singh :  మహిళలను అవమానించిన అర్ష్ దీప్ సింగ్.. ఆ గొంతుతో ఇమిటేట్ చేస్తూ

Arshdeep singh :  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో 2-2 సమం చేసింది. ఇందులో ఒక మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లు ఇండియా కి చేరుకున్నారు. ఓ ఎయిర్ ఫోర్టులో అభిమానులు జైస్వాల్ జైస్వాల్ అని అరిచారు. అందులో అమ్మాయిలు కూడా ఏ జైస్వాల్.. జైస్వాల్ అని అరచడంతో టీమిండియా బౌలర్ ఆ అమ్మాయిలను వెక్కిరిస్తూ.. జైస్వాల్ అని అమ్మాయిల గొంతు మాదిరిగా తన గొంతును మార్చి అరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Champagne Bottl: టెస్టుల్లో ఈ బ్లాక్ కలర్ వైన్ బాటిల్ ఎందుకు ఇస్తారో తెలుసా ?

అర్ష్ దీప్ సింగ్ వాయిస్ అదుర్స్ 

ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ టెస్ట్ సిరీస్ లో అర్ష్ దీప్ సింగ్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఇంగ్లాండ్ తో ఓవల్ లో జరిగిన ఐదో టెస్ట్ లో 5వ రోజు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో టీమిండియా 6 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. చివరి రోజు కేవలం 35 పరుగులకే డిఫెండింగ్ చేస్తూ.. సిరాజ్ అందుబాటులో ఉన్న 4 వికెట్లలో మూడు వికెట్లను కైవసం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ ఓటమి చెందేందుకు భారత్ తరపున కీలక బౌలర్ గా మారాడు సిరాజ్. ఈ మ్యాచ్ తరువాత సిరాజ్.. తన సహచరుడు అర్ష్ దీప్ సింగ్ నుంచి కొన్ని సోషల్ మీడియా ట్రిక్స్ నేర్చుకోవడం విశేషం.  ముఖ్యంగా టీమిండియా స్టార్ బౌలర్ సిరాజ్ కి మరో బౌలర్ అర్ష్ దీప్ సింగ్ సోషల్ మీడియా గురువు అయ్యాడు.

సోషల్ మీడియా గురువు.. అర్ష్ దీప్

మ్యాచ్ ముగిసిన తరువాత మొహమ్మద్ సిరాజ్ అర్ష్ దీప్ సింగ్ నుంచి కొన్ని సోషల్ మీడియా ట్రిక్స్ నేర్చుకుంటున్నట్టు గుర్తించబడింది. అర్ష్ దీప్ సింగ్.. సిరాజ్ ని నవ్వుతూ.. “ఒత్తిడి, ఏఒత్తిడి” అని చెప్పమని సూచించాడు. ఇన్ స్టా గ్రామ్ రీల్స్ అని తెలుస్తోంది. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన 5వ  టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 396  పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ లక్ష్యం 367 పరుగులు లక్ష్యం.  నాలుగో రోజు ఇంగ్లాండ్ 339/6 పరుగులు చేసింది. ఇక  ఇంగ్లండ్ 5వ రోజును 339-6 వద్ద ప్రారంభించింది. విజయానికి మరో 35 పరుగుల దూరంలో చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ ఉదయం ప్రారంభంలోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు, జెమీ స్మిత్, ఓవర్టన్ లను వికెట్లను తరగా తీశాడు.  మరో బౌలర్ ప్రసిద్ధ్ కూడా టంగ్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు అట్కిన్సన్ 17 పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించేంత పని చేశాడు. ఇదే క్రమంలో ఒంటి చేతితో బ్యాటింగ్ చేసేందుకు క్రిస్ వోక్స్ గ్రౌండ్ లోకి వచ్చాడు. కానీ వోక్స్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు. అట్కిన్సన్ చివరి బంతికి రెండు ఓవర్లు కూడా సింగిల్ తీసుకొని తనే క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే సిరాజ్ వేసిన తొలి బంతికే అట్కిన్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×