E-Paper
Advertisement

Asian Paints: బీసీసీఐతో ఏషియన్ పెయింట్స్ కోట్ల డీలింగ్‌.. రాయ్ పూర్ లో త‌న్నుకున్న రోహిత్‌, కోహ్లీ ఫ్యాన్స్ !

Asian Paints: బీసీసీఐతో ఏషియన్ పెయింట్స్ కోట్ల డీలింగ్‌.. రాయ్ పూర్ లో త‌న్నుకున్న రోహిత్‌, కోహ్లీ ఫ్యాన్స్ !
Advertisement

Asian Paints: ఇండియాలో బాగా పాపులర్ అయిన ఏషియన్ పెయింట్స్ సంస్థ ( Asian Paints) కీలక అడుగు వేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలితో ( Board of Control for Cricket in India ) భారీ డీలింగ్ కుదుర్చుకుంది ఏషియన్ సిమెంట్స్. భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఏషియన్ పెయింట్స్ భాగస్వామిగా డీలింగ్ కుదుర్చుకుంది. దాదాపు మూడు సంవత్సరాల పాటు బీసీసీఐతో ( BCCI) సత్సంబంధాలు కొనసాగించనుంది ఏషియన్ పెయింట్స్. ఈ మూడు సంవత్సరాల పాటు రూ.45 కోట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఇవ్వనుంది. ఈ మూడు సంవత్సరాలలో మొత్తం 110 మ్యాచ్ లకు బీసీసీఐ భాగస్వామిగా ఏషియన్ పెయింట్స్ ఉండనుంది. అంటే ఇకపైన టీమిండియా పురుషులు, మహిళలు, డొమెస్టిక్ సిరీస్ లు ఆడితే ప్లేయర్ల జెర్సీపైన ఏషియన్ పెయింట్స్ పేరు కచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ డీలింగ్ కోసం మొత్తం రూ.45 కోట్లు ఏషియన్ పెయింట్స్ ఖర్చు చేస్తుంది.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా  ( Team India vs South Africa ) మధ్య వన్డే సిరీస్ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి వన్డే మ్యాచ్ రాంచి వేదికగా జరగనుంది. డిసెంబర్ మూడో తేదీన రాయపూర్ ( Raipur) వేదికగా రెండో వన్డే అలాగే డిసెంబర్ 6వ తేదీన వైజాగ్ వేదికగా మూడవ వన్డే నిర్వహించనున్నారు. అయితే రాయిపూర్ కు సంబంధించిన రెండవ వండే టికెట్లు స్టేడియం దగ్గర ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి టికెట్ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు.

టికెట్ల కోసం తన్నుకున్న రోహిత్ శర్మ, కోహ్లీ ఫ్యాన్స్

వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs South Africa ) మధ్య జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ తుది జ‌ట్టులో ఆడునున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు ఇప్పటికే టీ20ల‌తో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వ‌న్డేలు ఆడుతున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు ప్లేయర్లు ఎక్కడ వన్డే ఆడినా అభిమానులు ఎగబడి చూసేందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే రాయపూర్ వేదికగా రెండో జరుగుతోంది. ఈ టికెట్ల కోసం రోహిత్ శర్మ ( Rohit Sharma) ఫ్యాన్స్ అలాగే కోహ్లీ ( Virat Kohli)  అభిమానులు దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. అయితే ఈ క్యూ పద్ధతిలో వెళ్లే సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ వైర‌ల్ గా మారింది. కాగా ద‌క్షిణాఫ్రికా వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య 5 టీ20లు కూడా జ‌రుగ‌నున్నాయి.

Advertisement

 

Also Read: Smriti Mandhana Wedding: పలాష్ కు మరో అమ్మాయితో ఎఫైర్.. పెళ్ళి ఆపేందుకే స్మృతి తండ్రి గుండెపోటు డ్రామాలు?

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×