Asian Paints: ఇండియాలో బాగా పాపులర్ అయిన ఏషియన్ పెయింట్స్ సంస్థ ( Asian Paints) కీలక అడుగు వేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలితో ( Board of Control for Cricket in India ) భారీ డీలింగ్ కుదుర్చుకుంది ఏషియన్ సిమెంట్స్. భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఏషియన్ పెయింట్స్ భాగస్వామిగా డీలింగ్ కుదుర్చుకుంది. దాదాపు మూడు సంవత్సరాల పాటు బీసీసీఐతో ( BCCI) సత్సంబంధాలు కొనసాగించనుంది ఏషియన్ పెయింట్స్. ఈ మూడు సంవత్సరాల పాటు రూ.45 కోట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఇవ్వనుంది. ఈ మూడు సంవత్సరాలలో మొత్తం 110 మ్యాచ్ లకు బీసీసీఐ భాగస్వామిగా ఏషియన్ పెయింట్స్ ఉండనుంది. అంటే ఇకపైన టీమిండియా పురుషులు, మహిళలు, డొమెస్టిక్ సిరీస్ లు ఆడితే ప్లేయర్ల జెర్సీపైన ఏషియన్ పెయింట్స్ పేరు కచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ డీలింగ్ కోసం మొత్తం రూ.45 కోట్లు ఏషియన్ పెయింట్స్ ఖర్చు చేస్తుంది.
Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( Team India vs South Africa ) మధ్య వన్డే సిరీస్ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి వన్డే మ్యాచ్ రాంచి వేదికగా జరగనుంది. డిసెంబర్ మూడో తేదీన రాయపూర్ ( Raipur) వేదికగా రెండో వన్డే అలాగే డిసెంబర్ 6వ తేదీన వైజాగ్ వేదికగా మూడవ వన్డే నిర్వహించనున్నారు. అయితే రాయిపూర్ కు సంబంధించిన రెండవ వండే టికెట్లు స్టేడియం దగ్గర ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి టికెట్ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు.
వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs South Africa ) మధ్య జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ తుది జట్టులో ఆడునున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు ఇప్పటికే టీ20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డేలు ఆడుతున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు ప్లేయర్లు ఎక్కడ వన్డే ఆడినా అభిమానులు ఎగబడి చూసేందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే రాయపూర్ వేదికగా రెండో జరుగుతోంది. ఈ టికెట్ల కోసం రోహిత్ శర్మ ( Rohit Sharma) ఫ్యాన్స్ అలాగే కోహ్లీ ( Virat Kohli) అభిమానులు దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. అయితే ఈ క్యూ పద్ధతిలో వెళ్లే సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. కాగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య 5 టీ20లు కూడా జరుగనున్నాయి.
THE CRAZE FOR ROHIT & VIRAT IN RAIPUR.🔥
Fans turned up in huge numbers for 2nd ODI tickets, eager to watch Rohit Sharma and Virat Kohli in Raipur pic.twitter.com/mDCz7hYaLs
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 25, 2025