E-Paper
Advertisement

Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ షెడ్యూల్ ఫిక్స్‌..టీమిండియా త‌ల‌ప‌డే జ‌ట్టు ఇదే..ఫ్రీగా చూడాలంటే

Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ షెడ్యూల్ ఫిక్స్‌..టీమిండియా త‌ల‌ప‌డే జ‌ట్టు ఇదే..ఫ్రీగా చూడాలంటే

Womens World Cup 2025 Semis:  మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ సెమీస్ దశ వరకు వచ్చింది. ఇప్పటికే నాలుగు జట్లు సెమీఫైనల్ కు కూడా వెళ్లాయి. పాయింట్లు పట్టిక ప్రకారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ అలాగే టీమ్ ఇండియా వరుసగా సెమీ మ‌ఫైనల్ కు చేరిపోయాయి. ఈ నేపథ్యంలోనే సెమీ ఫైనల్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేసింది ఐసీసీ. నిన్న దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో.. టీమిండియాతో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ జరగనుంది.

Also Read: Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ షెడ్యూల్ ఖ‌రారు..ఆ జ‌ట్టుతోనే టీమిండియాకు మ్యాచ్‌..పూర్తి వివ‌రాలు

మ‌హిళ‌ల‌ వ‌న్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ షెడ్యూల్ ఇదే

ఐసీసీ రూల్స్ ప్రకారం పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్న టీం ఇండియాతో రెండవ సెమీఫైనల్ ఆడాల్సి ఉంటుంది. అలాగే మొదటి సెమీ ఫైనల్ లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫైట్ ఉండనుంది. నిన్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే పరిస్థితి వేరే లాగా మారిపోయేది. అక్టోబర్ 29వ తేదీన మొదటి సెమీఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ గౌహతి వేదికగా నిర్వహించనున్నారు.

ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరగనుంది. అంటే మధ్యాహ్నం రెండున్నర గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. అలాగే రెండో సెమీఫైనల్ లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కూడా జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా తిలకించవచ్చు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇవాళ టీమిండియా చివరి లీగ్ దశ మ్యాచ్

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( World Cup 2025) భాగంగా ఇవాళ చిట్టచివరి లీగ్ దశ మ్యాచ్ ఆడనుంది మహిళల టీం ఇండియా జట్టు. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మహిళల టీం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( India Women vs Bangladesh Women, 28th Match ) మధ్య ఫైట్ జరగనుంది. నావి ముంబై స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వెళ్లగా బంగ్లాదేశ్ ఎలిమినేట్ అయింది. టీమిండియా గెలిచినా కూడా నాలుగో స్థానానికి పరిమితం అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

Also Read: Womens World Cup 2025: వ‌ర‌ల్డ్ క‌ప్ లో గుండు సున్నా…గంగ‌లో క‌లిసిన‌ పాకిస్తాన్ ప‌రువు..ఇక‌ ఇంటికి వెళ్లి గోధుమ పిండి పిసుక్కోండి

 

Related News

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

Big Stories

×