BigTV English
Advertisement

Ms Dhoni : ICC ఈవెంట్ కు డుమ్మా… ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్న ధోని.. ఏం గుండే రా అది

Ms Dhoni : ICC ఈవెంట్ కు డుమ్మా… ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్న ధోని.. ఏం గుండే రా అది

Ms Dhoni : టీీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేేదు.  టీమిండియాకి వరల్డ్ కప్, టీ-20 కప్ లు, ఛాంపియన్ ట్రోఫీ అందించిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు. ఇక ఆ తరువాత మెల్ల మెల్లగా అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించేశాడు ఎం.ఎస్.ధోనీ.  ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్.ధోనీకి చోటు లభించింది. ఈ ఘనత సాధించిన కొద్ది మంది ఇండియా క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు ధోనీ. భారత క్రికెట్ కి చేసిన సేవలకు లెజెండరీ ప్లేయర్ ధోనీ కి ఈ గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చోటు దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత అబ్బే రోడ్ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఏడుగురు దిగ్గజ ఆటగాళ్లలో భారత మాజీ కెప్టెన్ ఉన్నాడు.


Also Read : Rohit Sharma : ఆస్ట్రేలియా జెర్సీలో రోహిత్ శర్మ.. క్రేజీ ఫోటో వైరల్.. 90 కిలోలు పెరిగిపోయాడు ఏంటి

వాస్తవానికి ధోనీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనీకి చోటు లభించినప్పటికీ అతను అవార్డు తీసుకునేందుకు మాత్రం వెళ్లలేదు. ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. మహేంద్ర సింగ్ ధోని కి కూడా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు వచ్చింది.  అందులో పేర్లు వచ్చిన అందరు వెళ్లారు.  కానీ ధోని మాత్రం వెళ్లకపోవడం గమనార్హం.  ధోనీ తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్ దిగ్గజం డేనియల్ వెటోరీ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. పాకిస్తాన్ కి చెందిన సనా మిర్, ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ సారా టేలర్ లు కలిసి మొత్తం హాల్ ఆఫ్ ఫేమ్స్ ను 122కి చేర్చారు.   2009లో హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఇక ధోనీ 17వేలకు పైగాఅంతర్జాతీయ పరుగులు చేసిన మూడు ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లను గెలిచిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్ గా ధోనీ నిలిచాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విను మన్కడ్, దియాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతూ డేవిడ్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ధోనీ 90 టెస్టుల్లో 256 క్యాచ్ లు, 38 స్టంపింగ్ లతో పాటు 4,786 పరుగులు చేశాడు. ప్రస్తుతం ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటివరకు ఇంత పేలవ ప్రదర్శన కనబరచడం చెన్నై కి ఇది తొలి సీజన్ కావడం విశేషం.

Tags

Related News

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Big Stories

×