E-Paper
Advertisement

Ms Dhoni : ICC ఈవెంట్ కు డుమ్మా… ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్న ధోని.. ఏం గుండే రా అది

Ms Dhoni : ICC ఈవెంట్ కు డుమ్మా… ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్న ధోని.. ఏం గుండే రా అది
Advertisement

Ms Dhoni : టీీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేేదు.  టీమిండియాకి వరల్డ్ కప్, టీ-20 కప్ లు, ఛాంపియన్ ట్రోఫీ అందించిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు. ఇక ఆ తరువాత మెల్ల మెల్లగా అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించేశాడు ఎం.ఎస్.ధోనీ.  ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్.ధోనీకి చోటు లభించింది. ఈ ఘనత సాధించిన కొద్ది మంది ఇండియా క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు ధోనీ. భారత క్రికెట్ కి చేసిన సేవలకు లెజెండరీ ప్లేయర్ ధోనీ కి ఈ గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చోటు దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత అబ్బే రోడ్ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఏడుగురు దిగ్గజ ఆటగాళ్లలో భారత మాజీ కెప్టెన్ ఉన్నాడు.

Also Read : Rohit Sharma : ఆస్ట్రేలియా జెర్సీలో రోహిత్ శర్మ.. క్రేజీ ఫోటో వైరల్.. 90 కిలోలు పెరిగిపోయాడు ఏంటి

Advertisement

వాస్తవానికి ధోనీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనీకి చోటు లభించినప్పటికీ అతను అవార్డు తీసుకునేందుకు మాత్రం వెళ్లలేదు. ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. మహేంద్ర సింగ్ ధోని కి కూడా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు వచ్చింది.  అందులో పేర్లు వచ్చిన అందరు వెళ్లారు.  కానీ ధోని మాత్రం వెళ్లకపోవడం గమనార్హం.  ధోనీ తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్ దిగ్గజం డేనియల్ వెటోరీ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. పాకిస్తాన్ కి చెందిన సనా మిర్, ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ సారా టేలర్ లు కలిసి మొత్తం హాల్ ఆఫ్ ఫేమ్స్ ను 122కి చేర్చారు.   2009లో హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇక ధోనీ 17వేలకు పైగాఅంతర్జాతీయ పరుగులు చేసిన మూడు ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లను గెలిచిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్ గా ధోనీ నిలిచాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విను మన్కడ్, దియాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతూ డేవిడ్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ధోనీ 90 టెస్టుల్లో 256 క్యాచ్ లు, 38 స్టంపింగ్ లతో పాటు 4,786 పరుగులు చేశాడు. ప్రస్తుతం ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటివరకు ఇంత పేలవ ప్రదర్శన కనబరచడం చెన్నై కి ఇది తొలి సీజన్ కావడం విశేషం.

Advertisement

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×