Ponzi Scheme-Pakistan: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) కంటే ముందు పాకిస్తాన్ జట్టు ఊహించని షాక్ తగిలింది. 100 కోట్ల రూపాయల కేసులో ఇరుక్కుపోయారు పాకిస్తాన్ క్రికెటర్లు. ఓ మోసగాడిని నమ్మి, బాబర్ ఆజాం ( Babar Azam), మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan ), షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi ) లాంటి పాకిస్తాన్ క్రికెటర్లు 100 కోట్ల వరకు పోగొట్టుకున్నారట. ఈ ప్లేయర్లు అందరినీ మోసం చేసి రూ.100 కోట్లు వసూలు చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి, రాత్రికి రాత్రి పాకిస్తాన్ నుంచి దుబాయ్ కి జంప్ అయినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. వీళ్లందరినీ పోంజీ స్కీమ్ ( Ponzi Scheme) పేరుతో మోసం చేసినట్లు తెలుస్తోంది.
మనిషికి లాభం వస్తుందంటే ఏదైనా చేస్తాడు. ప్రపంచాన్ని నడిపించే డబ్బు విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడు. రూపాయికి రెండు రూపాయలు ఇస్తానంటే ఎలాంటి పని అయినా చేస్తారు. అచ్చం పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అదే పనిచేసి అడ్డంగా దొరికిపోయారు. పాకిస్తాన్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పోంజీ స్కీమ్ ( Ponzi Scheme) పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డాడట. ఇతడు పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు అక్కడ ఉన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేశాడట. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు ఇస్తానని, పోంజీ స్కీమ్ తీసుకువచ్చాడట. ముందుగా డబ్బులు బాగానే వసూలు చేసి ఇప్పుడు జంప్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది లాంటి బడా క్రికెటర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడట ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్. దాదాపు క్రికెటర్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు అతగాడు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ క్రికెటర్ల అందరి నుంచి దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసిన ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్, రాత్రికి రాత్రే దుబాయ్ కి జంప్ అయ్యాడట. ముందుగా డబ్బులు ఆశ చూపించి, ఎక్కువ స్థాయిలో పొదుపు అయిన తర్వాత జంప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే రూ.100 కోట్లు పోవడంతో పాకిస్తాన్ క్రికెటర్లు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కూడా తెలిసినట్టు సమాచారం. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
నిన్నటి వరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమని పదేపదే చెప్పింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే నిన్న ఐసీసీ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడే జట్టును కూడా ప్రకటించాల్సి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. సల్మాన్ అలీ అఘా నేతృత్వంలో 15 మంది ప్లేయర్లను ప్రకటించింది.
🚨 BABAR AZAM GOT SCAMMED IN PAKISTAN 🚨
Babar, Rizwan, Shaheen, and several other Pakistan players have lost money in a Ponzi Scheme. A person these players trusted paid them briefly, then left the Country 😆
– What's your take 😁 pic.twitter.com/6oZtbWSWuT
— Richard Kettleborough (@RichKettle07) January 26, 2026