Kavya Maran – SRH: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ జట్లను గడగడలాడించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు చతికల పడింది. పసికూన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్ల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. వరుసగా టి20 లు, వన్డేలు, టెస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టోర్నమెంట్లు ఓడిపోతోంది. లేటెస్ట్ గా పాకిస్తాన్ పర్యటనలో ఆస్ట్రేలియాకు ఘోర అవమానం ఎదురైంది. టీ20 సిరీస్ తోపాటు వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. అటు బంగ్లాదేశ్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓటమి పాలైంది ఆస్ట్రేలియా.
ప్రస్తుతం బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్ సందర్భంగా దారుణంగా ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొత్త న్యూస్ వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్… సరికొత్త నిర్ణయం తీసుకుందట. 2027 వన్డే వరల్డ్ కప్ అతి త్వరలోనే జరగనుంది. దాదాపు 365 రోజుల సమయం మాత్రమే ఈ టోర్నమెంట్ కు ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా మ్యాచులు ఓడిపోతున్న తరుణంలో క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుందట. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎవరూ కూడా ఐపీఎల్ ఆడకుండా చర్యలు తీసుకోనుందట. 2027 ఐపీఎల్ టోర్నమెంటులో ట్రావిస్ హెడ్, కమిన్స్ లాంటి కీలక ప్లేయర్లు వచ్చే ఐపీఎల్ ఆడకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచే లక్ష్యంగా తమ జట్టును తయారు చేసే దిశగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.
ఇందులో భాగంగానే ఐపిఎల్ ఆడే కీలక ప్లేయర్లను.. వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేయాలని సన్నద్ధమవుతున్నారట. ఇదే జరిగితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ లాంటి డేంజర్ ఆటగాళ్లు ఐపిఎల్ 2027 లో ఆడకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందట. ఇదే జరిగితే ఐపిఎల్ 2027 టోర్నమెంట్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ చాలా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా లాంటి భయంకరమైన జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్లేయర్లు లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (SRH) ముందుకు వెళ్లడం కష్టమే. మొన్ననే ఎలిమినేటర్ సందర్భంగా చిత్తుగా ఓడిపోయింది హైదరాబాద్. అలాంటి తప్పిదం జరగకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది కావ్య పాప. ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐపిఎల్ ఆడకుండా అక్కడి క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఒకవేళ క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు చూస్తుంటే, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.