Bangladesh: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఆడకపోతే బోర్డుకు ఎలాంటి నష్టం ఉండబోదని.. నష్టమంతా కేవలం బంగ్లాదేశ్ క్రికెటర్ల పైన పడుతుందని వెల్లడించారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండబోదని… అసలు బంగ్లాదేశ్ క్రికెటర్లు మెరుగైన ప్రదర్శన చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు. అటు ఇండియాకు వెళ్లి టీ20 వరల్డ్ కప్ 2026 ఆడండి అంటూ మీర్ పూర్ స్టేడియం బయట రచ్చ చేస్తున్నారు బంగ్లాదేశ్ ఫ్యాన్స్.
పైన పేర్కొన్న వ్యాఖ్యలు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు చాలా సీరియస్ అవుతున్నారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఏజెంట్ అంటూ తమీమ్ ఇక్బాల్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అతన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని కూడా బంగ్లాదేశ్ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం నుంచి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ తో పాటు అంతర్జాతీయ మ్యాచ్ లు కూడా బహిష్కరిస్తామని బంగ్లాదేశ్ క్రికెటర్స్ అసోసియేషన్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా దిగి వచ్చింది. నజ్ముల్ ఇస్లాంకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాదు నజ్ముల్ ఇస్లాంను పదవి నుంచి తొలగించుకున్నట్లు అధికారిక ప్రకటన చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. అయితే అప్పటికే సమయం గడిచిపోవడంతో గురువారం జరగాల్సిన రెండు మ్యాచ్లు వాయిదా పడ్డాయి.
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తోన్న తీరుపై నేపథ్యంలో అభిమానులు చాలా సీరియస్ అయ్యారు. మీర్ పూర్ స్టేడియం బయట రచ్చ రచ్చ చేశారు. బ్యానర్లు అలాగే హోర్డింగ్స్ అన్ని పీకి పారేశారు. అలాగే ఇండియాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు పర్యటించేలా వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో పర్యటించకుండా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, బంగ్లాదేశ్ క్రికెటర్ల ప్రాణాలు కూడా తీస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విషయంలో ఇండియాతో పెట్టుకోవద్దని కోరుతున్నారట. ఇందులో భాగంగానే మీర్ పూర్ స్టేడియం బయట రచ్చ రచ్చ చేశారు బంగ్లా ఫ్యాన్స్ ( Bangladesh Fans).
🚨🚨 Bangladesh Cricket is in deep deep trouble after getting into conflict with BCCI.
– Scenes outside the Mirpur Stadium after both games getting abondoned amidst bangladesh players protest!!
Message is clear. Don't go against India ever again!! pic.twitter.com/VnowR5il7K
— Rajiv (@Rajiv1841) January 15, 2026