Bangladesh: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో బంగ్లాదేశ్ తోక ముడిచినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఇండియాలో పర్యటించబోమని, తమకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయాలని విర్రవీగింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh cricket board). ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బహిరంగ లేఖ రాసింది. అయితే బంగ్లాదేశ్ ఎన్ని కుప్పిగంతులు వేసిన కూడా, ఐసీసీ ముందు పారలేదు. మీరు పిల్ల బచ్చాలురా అంటూ వాళ్ల డిమాండ్లను పక్కకు పెట్టారట ICC బాస్ జై షా. దీంతో తోక ముడుచుకుని ఇండియాలో పర్యటించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ సిద్ధమవుతోంది. ముందుగా ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే, ఇండియాలో పర్యటించబోతుందట ఆ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.
ఇండియాలో ( India) తమ ప్లేయర్లపై దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని ఐసీసీ ముందు విన్నవించుకుందట బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. తమకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కూడా కోరిందట. అయితే ఈ విషయంలో ఐసీసీ ( ICC ) కాస్త తగ్గింది. బంగ్లాదేశ్ అడిగినట్లుగానే, ఆ దేశం క్రికెటర్లకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసేందుకు ఐసీసీ బాస్ జై షా ( ICC Jay shah) ప్రత్యేకంగా హామీ ఇచ్చారట. ఇండియన్ ఆర్మీ తో పాటు ప్రత్యేకంగా ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారట. ఇండియాలో పర్యటించిన అన్ని రోజులు బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఎలాంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత తమదని ఐసీసీ మేరకు ప్రకటన చేసిందట. దీనికోసం ఇండియన్ ఆర్మీ తో పాటు ఏజెన్సీని వాడుకోనుంది ఐసీసీ. ఇందులో భాగంగా మోడీ ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందట ఐసీసీ. దీనికి మోడీ సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇండియాలో లీగ్ దశలో మొత్తం నాలుగు మ్యాచ్ ఆడనుందట. అయితే ఈ మ్యాచ్ లు ముంబైతో పాటు కోల్ కతా వేదికగా ఉన్నాయి. అక్కడ బంగ్లాదేశ్ క్రికెటర్లు పర్యటిస్తే కాస్త గొడవలు జరిగే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్ లు సౌత్ ఇండియాలో నిర్వహించాలని సన్నద్ధం అవుతుందట ఐసీసీ. చెన్నైలోని చెపాక్ స్టేడియంతో పాటు, తిర్వనంతపూరం స్టేడియాన్ని వాడుకోవాలని అనుకుంటున్నారట. ఇది ఇలా ఉండగా, ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా విండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్ తో ఆడనుంది బంగ్లా.
🚨 BANGLADESH CRICKET TEAM IS FINALLY COMING TO INDIA 🚨
The ICC had appointed an independent agency to assess security issues concerning the Bangladesh team, and the agency has stated that there is no security risk for the Tigers and the situation is normal. The ICC hopes that… pic.twitter.com/G8MIRvB30N
— lndian Sports Netwrk (@IS_Netwrk29) January 13, 2026