E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల కోసం రంగంలోకి ఇండియ‌న్ ఆర్మీ..జై షా ప్లాన్ అదుర్స్‌ !

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల కోసం రంగంలోకి ఇండియ‌న్ ఆర్మీ..జై షా ప్లాన్ అదుర్స్‌ !
Advertisement

Bangladesh: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో బంగ్లాదేశ్ తోక ముడిచినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఇండియాలో పర్యటించబోమని, తమకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయాలని విర్రవీగింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh cricket board). ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బహిరంగ లేఖ రాసింది. అయితే బంగ్లాదేశ్ ఎన్ని కుప్పిగంతులు వేసిన కూడా, ఐసీసీ ముందు పారలేదు. మీరు పిల్ల బచ్చాలురా అంటూ వాళ్ల డిమాండ్లను పక్కకు పెట్టారట ICC బాస్ జై షా. దీంతో తోక ముడుచుకుని ఇండియాలో పర్యటించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ సిద్ధమవుతోంది. ముందుగా ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే, ఇండియాలో పర్యటించబోతుందట ఆ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

బంగ్లాదేశ్ భద్రత కోసం స్పెషల్ ఏజెన్సీ ?

Advertisement

ఇండియాలో ( India) తమ ప్లేయర్లపై దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని ఐసీసీ ముందు విన్నవించుకుందట బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. తమకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కూడా కోరిందట. అయితే ఈ విషయంలో ఐసీసీ ( ICC ) కాస్త తగ్గింది. బంగ్లాదేశ్ అడిగినట్లుగానే, ఆ దేశం క్రికెటర్లకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసేందుకు ఐసీసీ బాస్ జై షా ( ICC Jay shah) ప్రత్యేకంగా హామీ ఇచ్చారట. ఇండియన్ ఆర్మీ తో పాటు ప్రత్యేకంగా ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారట. ఇండియాలో పర్యటించిన అన్ని రోజులు బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఎలాంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత తమదని ఐసీసీ మేరకు ప్రకటన చేసిందట. దీనికోసం ఇండియన్ ఆర్మీ తో పాటు ఏజెన్సీని వాడుకోనుంది ఐసీసీ. ఇందులో భాగంగా మోడీ ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందట ఐసీసీ. దీనికి మోడీ సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

వేదికలు మార్చనున్న ఐసీసీ ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇండియాలో లీగ్ దశలో మొత్తం నాలుగు మ్యాచ్ ఆడనుందట. అయితే ఈ మ్యాచ్ లు ముంబైతో పాటు కోల్ క‌తా వేదికగా ఉన్నాయి. అక్కడ బంగ్లాదేశ్ క్రికెటర్లు పర్యటిస్తే కాస్త గొడవలు జరిగే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్ లు సౌత్ ఇండియాలో నిర్వహించాలని సన్నద్ధం అవుతుందట ఐసీసీ. చెన్నైలోని చెపాక్ స్టేడియంతో పాటు, తిర్వ‌నంత‌పూరం స్టేడియాన్ని వాడుకోవాలని అనుకుంటున్నారట. ఇది ఇలా ఉండ‌గా, ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫిబ్ర‌వరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్న‌మెంట్ లో భాగంగా విండీస్‌, ఇట‌లీ, ఇంగ్లండ్‌, నేపాల్ తో ఆడ‌నుంది బంగ్లా.

Advertisement

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

 

Related News

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

Big Stories

Advertisement
×