E-Paper
Advertisement

Mohsin Naqvi: సూర్యకు కుద‌ర‌క‌పోతే, నా ఆఫీసుకు అర్ష‌దీప్ ను పంపించండి..ఆసియా క‌ప్ ఇచ్చేస్తా

Mohsin Naqvi: సూర్యకు కుద‌ర‌క‌పోతే, నా ఆఫీసుకు అర్ష‌దీప్ ను పంపించండి..ఆసియా క‌ప్ ఇచ్చేస్తా
Advertisement

Mohsin Naqvi:  ఆసియా 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంటులో ఛాంపియన్ గా టీమిండియా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. అయితే ఫైనల్లో గెలిచిన కూడా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ట్రోఫీని టీమిండియా తీసుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ప్రస్తుతం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ( Asian Cricket Council ) చైర్మన్ గా ఉన్నారు. ఈ కారణంగానే మనవాళ్లు ఆ ట్రోఫీని తీసుకోలేదు. ఇండియాకు పంపించాలని మొహ్సిన్ నఖ్వీకి చాలా సార్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) రిక్వెస్ట్ పెట్టింది. అయినా కూడా మొహ్సిన్ నఖ్వీ విన‌డం లేదు. ఇప్ప‌టికీ ట్రోఫీని పంపించ‌లేదు.

Also Read: IND VS PAK: 95, 195, 295 పరుగుల వద్ద సిక్స‌ర్ కొట్టిన ఏకైక మొన‌గాడు..పాకిస్థాన్ కు వెన్నులో వ‌ణుకు పుట్టించాడు

సూర్యకు కుద‌ర‌క‌పోతే, నా ఆఫీసుకు అర్ష‌దీప్ ను పంపించండి

Advertisement

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ట్రోఫీ విషయంలో తాజాగా మరోసారి మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi )ని సంప్రదించిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇప్పటికైనా ట్రోఫీని ఇవ్వాలని కోరిందట. టోర్నమెంట్ ఫినిష్ అయి నెల రోజులు పూర్తి అయింది. ఇప్పటికీ కూడా ట్రోఫీ ఇవ్వకపోతే ఎలా అని మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi )కి లేఖ రాసిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే దీనిపై తాజాగా మొహ్సిన్ నఖ్వీ స్పందించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాను చెప్పాను.. వస్తే సూర్య కుమార్ ను తన ఆఫీస్ కు వచ్చి ట్రోఫీని తీసుకు వెళ్ళమనండి.. అతనికి కుదరకపోతే టీమిండియాలో ఎవరైనా పర్వాలేదు. అర్షదీప్ వచ్చిన కూడా తాను ట్రోఫీ ఇచ్చేస్తా. అందులో ఎలాంటి డౌట్ లేదంటూ మొహ్సిన్ నఖ్వీ సమాధానం ఇచ్చారట. కానీ నేను మాత్రం ఇండియాకు పంపించేది లేదని భీష్ముంచుకొని కూర్చున్నారట. దీంతో మొహ్సిన్ నఖ్వీ పైన భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

ఫైనల్స్ లో గెలిచిన టీమిండియా

ఆసియా ఫైనల్ 2025 టోర్నమెంటులో ( Asia Cup 2025 )  టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఆసియా కప్ ను 9వ సారి గెలుచుకుంది టీం ఇండియా. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ( Pak) 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి కుప్పకూలింది. మిడిల్ ఆర్డ‌ర్‌ కుప్పకూలడంతో పాకిస్తాన్ తక్కువ స్కోరు చేసింది. ఇక అనంతరం చేజింగ్ కు దిగిన టీమిండియా, అద్భుతంగా రాణించింది. టాపార్డర్ వికెట్లు కుప్పకూలినా, తిల‌క్ వ‌ర్మ మాత్రం చివరి వరకు పోరాడాడు. దీంతో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

Advertisement

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×