BigTV English
Advertisement

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

BCCI:  భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో… రెచ్చిపోతున్న పాకిస్తాన్ క్రికెటర్ల తోక ముడిచేందుకు… అడుగులు వేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). హరీస్ రవూఫ్ ( Haris Rauf), సాహిబ్జాదా ఫర్హానా ( Sahibzada Farhan ) పై.. ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ లేదా రేపు ఈ ఇద్దరి పైన ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ నిర్ణయం తీసుకుంది. మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా…హరీస్ రవూఫ్ , ఫర్హానా ఇద్దరు… రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టేలా.. సైగలు చేశారు.


Also Read: Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

హరీస్ రవూఫ్ , ఫర్హానాపై ఫిర్యాదు

మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఒకరు గన్ తో పేల్చిన సెలబ్రేషన్స్ చేసుకోగా… మరొకరు ఇండియా జెట్స్ కూల్ చేశామని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సంఘటనపై భారతీయులు అలాగే టీమిండియా క్రికెటర్లు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. హరీస్ రవూఫ్ , ఫర్హానా ఇద్దరి పైన జీవితకాల నిషేధం విధించేలా ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది బీసీసీఐ.


సూర్య కుమార్ యాదవ్ పై ( SKY) పాకిస్థాన్ కుట్ర‌లు

ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో… రెచ్చిపోతున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు.. ఇప్పుడు సూర్య కుమార్ యాద‌వ్ ను టార్గెట్ చేశారు. హరీస్ ర‌వూఫ్‌, ఫ‌ర్హాన్ ల‌పై బీసీసీఐ ఫిర్యాదు చేస్తే… ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్థాన్ కుట్ర‌లు చేస్తోంది. సూర్య కుమార్ యాద‌వ్ పై ఫిర్యాదు చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ఇవాళ సాయంత్రం, లేదా రేపు సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్థాన్ ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా… ఇప్ప‌టికే పాకిస్థాన్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య రెండు మ్యాచ్ లు జ‌రిగాయి. గ్రూప్ స్టేజ్ లో ఒక‌టి జ‌రుగ‌గా… సూప‌ర్ 4 లో భాగంగా..మ‌రో మ్యాచ్ జ‌రిగింది. అయితే… ఈ రెండు మ్యాచ్ ల‌లో పాకిస్థాన్ టీమిండియా చేతిలో దారుణంగా ఓట‌మి పాలైంది. అయితే… ఈ రెండు మ్యాచ్ ల స‌మ‌యంలోనూ.. పాకిస్థాన్ కెప్టెన్ స‌ల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌లేదు సూర్య భాయ్‌. అటు గెలిచిన త‌ర్వాత‌.. టీమిండియా ( Team India) ప్లేయ‌ర్లు కూడా ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. ఇక ఈ అంశంపైనే సూర్య‌ను విల‌న్ చేస్తూ..ఐసీసీకి ఫిర్యాదు చేయ‌నుంద‌ట పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. మ‌రి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇస్తున్న ఈ ఫిర్యాదుపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అటు బీసీసీఐ మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటోంది.

 

Also Read: Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

 

Related News

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Big Stories

×