BigTV English
Advertisement

Indian Railway: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్, పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం!

Indian Railway: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్, పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం!

Railway Employees Bonus 2025:

పండుగ వేళ భారతీయ రైల్వే తన ఉద్యోగులకు క్రేజీ న్యూస్ చెప్పింది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సమావేశం అయిన ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్.. రైల్వేఉద్యోగులకు బోనస్ తో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.


11 లక్షల మంది ఉద్యోగులకు రూ. 1,865 కోట్ల బోనస్

దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల సాలరీని ఉత్పాదకత బోనస్‌ గా ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్  ఓకే చెప్పింది. ఈ నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం రూ.1865.68 కోట్లు పీఎల్‌బీ కింద చెల్లించనున్నట్లు కేంద్ర  రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే పని తీరును మరింత మెరుగు పరిచేలా ఈ ప్రోత్సాహం ఉపయోగపడుతుందన్నారు.

ప్రతి ఉద్యోగికి రూ. 18 వేల బోనస్!

ఇక కేంద్రం తాజా ప్రకటనతో అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజులకు గరిష్టంగా రూ.17,951 బోనస్ చెల్లించనున్నారు. ఈ మొత్తాన్ని రైల్వే లోని పలువురు ఉద్యోగులకు అందివ్వనున్నారు. ట్రాక్ మెయింటెయినర్లు, లోకోమోటివ్ పైలట్లు, రైలు  గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌ వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌ మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్‌ సీ ఉద్యోగులకు ఈ బోనస్ అందనుంది. 2024-25 సంవత్సరంలో రైల్వేల పనితీరు చాలా బాగుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే 1614.90 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసిందన్నారు. అదే సమయంలో 730 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్‌కు కేంద్ర మంత్రి కూడా ఆమోదం తెలిపారని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్రం తాజా నిర్ణయంతో రైల్వే ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతేడాది దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్‌ ఇచ్చింది. మొత్తం రూ.2,029 కోట్ల బోనస్‌  అందించింది.


Read Also: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

ఎన్నికల వేళ బీహార్ కు వరాలు

తాజా క్యాబినెట్ సమావేశంలో త్వరలో ఎన్నికలు జరగబోయే బీహార్ మీద కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. బీహార్‌ లో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2,192 కోట్లతో రైల్వే డబ్లింగ్‌కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అటు భక్తియార్‌పూర్‌- రాజ్‌ గిర్‌- తిలయ్యా రైల్వేలైన్‌ కు ఆమోదం తెలిపింది. మరోవైపు రూ.3,822.31 కోట్లతో నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్ణయం పట్ల బీహారీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:  ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Big Stories

×