Mohsin Naqvi: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో చివరి క్షణంలో బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో ( Bangladesh) హిందువులపై దాడులు, ఆ తర్వాత ముస్తాఫిజుర్ రెహ్మన్ ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ విధించిన నేపథ్యంలో వివాదం చెలరేగి టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగాల్సి వచ్చింది. దానికి తోడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మసాలా చల్లి రెచ్చగొట్టాడు. దీంతో బీసీసీఐపై బంగ్లాదేశ్ ఎగిరి పడింది. తటస్థ వేదిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, పాకిస్తాన్ చెప్పినట్లు బంగ్లాదేశ్ ఆడింది. దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు. చివరికి టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) బహిష్కరించింది బంగ్లాదేశ్. దీంతో కోట్లల్లో బంగ్లాదేశ్ నష్టపోయింది. ఇక ఇప్పుడు తప్పు తెలుసుకున్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) చైర్మన్ మొక్సిన్ నఖ్వీని ( pcb Mohsin Naqvi ) ఉద్దేశించి విమర్శలు చేస్తోంది. యూటర్న్ తీసుకున్న బంగ్లాదేశ్ ( Bangladesh)…మొక్సిన్ నఖ్వీ కారణంగానే తమ క్రికెట్ బోర్డ్ నాశనమైందని అంటోంది.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించకుండా బంగ్లాదేశ్ ను ఆపింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొక్సిన్ నఖ్వీ అంటూ బంగ్లాదేశ్ మాజీ భద్రతాధికారి సయ్యద్ హక్ ( BCB FORMER SECURITY SYED HAQUE) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జిత్తుల మారి నక్క మొక్సిన్ నఖ్వీ మాటలు విని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ దారి తప్పిందని హాట్ కామెంట్స్ చేశారు. ఆ మొక్సిన్ నఖ్వీ గాడి వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్నారు. ఇప్పుడు ఐసీసీ తీసుకోబోయే యాక్షన్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ బలి కావాల్సిందేనన్నారు.
దీని అంతటికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొక్సిన్ నఖ్వీ అంటూ ఫైర్ అయ్యారు సయ్యద్ హక్. మొక్సిన్ నఖ్వీ మాట విని, టీ20 వరల్డ్ కప్ ఆడకుండా బంగ్లాదేశ్ బహిష్కరించిందని తెలిపారు. ఇప్పుడు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు సయ్యద్ హక్. వెనక ఉండి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలను మొక్సిన్ నఖ్వీ రెచ్చగొట్టాడని, చివరకు చేతులు దులుపుకున్నాడని ఆగ్రహించారు. ఇప్పుడు 10 ఏళ్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును వెనక్కి నెట్టి, సర్వనాశనం చేశాడని సీరియస్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ మాజీ భద్రతాధికారి సయ్యద్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కాగా హిందువులపై బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతోన్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహ్మన్ ఐపీఎల్ ఆడకుండా బీసీసీఐ నిర్నయం తీసుకుంది. దీంతో తాము ఇండియాకు రాబోమని, పాకిస్తాన్ చెప్పినట్లు విన్న బంగ్లా, టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ బహిష్కరించింది.
🚨 BIG STATEMENT BY BCB FORMER SECURITY SYED HAQUE ON PCB 🚨
"Mohsin Naqvi persuaded Bangladesh to not travel to India. Now, If India do not tour here, Bangladesh cricket will go 5-10 years behind. PCB betrayed us."
What's your take 🤔pic.twitter.com/kbmLUb8rp4
— Richard Kettleborough (@RichKettle07) February 20, 2026