Tanveer Ahmed: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్ అయిన టీమిండియా, సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా నిన్న టైటిల్ గెల్చుకుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad) జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team India vs New Zealand, Final ) తలపడ్డాయి. అయితే వన్ సైడ్ గా నడిచిన ఈ మ్యాచ్ లో టీమిండియా అవలీలగా గెలిచింది. ఈ మ్యాచ్ లో 96 పరుగుల భారీ తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ సందర్భంగా టీమిండియా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. పొద్దున నుంచి ఈ విషం కక్కుతున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొదట టీమిండియాను మెచ్చుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed), 24 గంటలు కాకముందే మాట మార్చాడు. ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని బాంబు పేల్చాడు. ఫిక్సింగ్ జరగడం వల్ల ఫైనల్ మ్యాచ్ వన్ సైడ్ గా జరిగిందని ఆరోపణలు చేశాడు తన్వీర్ అహ్మద్. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 250 పరుగులు చేస్తే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఖచ్చితంగా విజయం సాధించాలి..
పొగ మంచు కారణంగా టీమిండియా బౌలర్లు అసలు బంతులు వేయలేక పోయేవారు. కానీ ఆ పరిస్థితికి విరుద్ధంగా టీమిండియా బౌలర్లు అదరగొట్టారని అనుమానం వ్యక్తం చేశాడు తన్వీర్ అహ్మద్. అంటే సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా బంతిలో చిప్ లు పెట్టారని.. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు త్వరగా అవుట్ అయినట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మల కళ్ళల్లో ఆనందం చూసేందుకు టీమిండియా గెలిచేలా ఫిక్సింగ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన్వీర్ అహ్మద్ తో పాటు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ కూడా.. టీమిండియా పై విషం కక్కాడు. టీమిండియా బ్యాటింగ్ చేసిన తర్వాత స్టేడియంలో లైట్లు ఆర్పేసి.. పిచ్ మార్చేసారని బాంబు పేల్చాడు ఇంజమాం. అందువల్లే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఇదంతా జై షా ఆధ్వర్యంలోనే జరిగిందని పేర్కొన్నాడు. అయితే తన్వీర్ అహ్మద్ తో పాటు ఇంజమాం చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
Shunyakumar Yadav is probably the worst captain to touch this beautiful trophy. He literally did nothing throughout the tournament. That USA only, and it shouldn't be appreciated because he is known to score against the minnows. Since that match he has failed against
– Namibia… pic.twitter.com/QbbZ17aRKZ— Cricket Paradox (@Cricket_Paradox) March 9, 2026