E-Paper
Advertisement

Tanveer Ahmed: ఫిక్సింగ్ వ‌ల్లే ఫైన‌ల్ మ్యాచ్ వ‌న్ సైడ్ గా సాగింది.. రోహిత్, ధోని కోస‌మే ఈ కుట్ర‌ !

Tanveer Ahmed: ఫిక్సింగ్ వ‌ల్లే ఫైన‌ల్ మ్యాచ్ వ‌న్ సైడ్ గా సాగింది.. రోహిత్, ధోని కోస‌మే ఈ కుట్ర‌ !
Advertisement

Tanveer Ahmed:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్ అయిన టీమిండియా, సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా నిన్న టైటిల్ గెల్చుకుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad) జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team  India vs New Zealand, Final ) తలపడ్డాయి. అయితే వన్ సైడ్ గా నడిచిన ఈ మ్యాచ్ లో టీమిండియా అవలీలగా గెలిచింది. ఈ మ్యాచ్ లో 96 పరుగుల భారీ తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ సందర్భంగా టీమిండియా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. పొద్దున నుంచి ఈ విషం కక్కుతున్నారు.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

టీమిండియా విజయం పై తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొదట టీమిండియాను మెచ్చుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed), 24 గంటలు కాకముందే మాట మార్చాడు. ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని బాంబు పేల్చాడు. ఫిక్సింగ్ జరగడం వల్ల ఫైనల్ మ్యాచ్ వన్ సైడ్ గా జరిగిందని ఆరోపణలు చేశాడు తన్వీర్ అహ్మద్. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 250 పరుగులు చేస్తే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఖచ్చితంగా విజయం సాధించాలి..

పొగ మంచు కారణంగా టీమిండియా బౌలర్లు అసలు బంతులు వేయలేక పోయేవారు. కానీ ఆ పరిస్థితికి విరుద్ధంగా టీమిండియా బౌలర్లు అదరగొట్టారని అనుమానం వ్య‌క్తం చేశాడు తన్వీర్ అహ్మద్. అంటే సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా బంతిలో చిప్ లు పెట్టారని.. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు త్వరగా అవుట్ అయినట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మల కళ్ళల్లో ఆనందం చూసేందుకు టీమిండియా గెలిచేలా ఫిక్సింగ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫైన‌ల్స్ ఇంజమామ్ హాట్ కామెంట్స్‌

Advertisement

తన్వీర్ అహ్మద్ తో పాటు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ కూడా.. టీమిండియా పై విషం కక్కాడు. టీమిండియా బ్యాటింగ్ చేసిన తర్వాత స్టేడియంలో లైట్లు ఆర్పేసి.. పిచ్ మార్చేసారని బాంబు పేల్చాడు ఇంజమాం. అందువల్లే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఇదంతా జై షా ఆధ్వర్యంలోనే జరిగిందని పేర్కొన్నాడు. అయితే తన్వీర్ అహ్మద్ తో పాటు ఇంజమాం చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

 

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×