E-Paper
Advertisement

Champions Trophy 2025| ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే!.. దుబాయ్ లేదా శ్రీలంకలో ఆడే అవకాశం

Champions Trophy 2025| ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే!.. దుబాయ్ లేదా శ్రీలంకలో ఆడే అవకాశం
Advertisement

Champions Trophy 2025 updates(Cricket news today telugu): పాకిస్తాన్ లో రాబోయే సంవత్సరం లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు వెళ్లే అవకాశాలు కనబడడం లేదు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఆడబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు పాకిస్తాన్ కు బదులుగా దుబాయ్ లేదా శ్రీలంకలో జరిగే అవకాశాలున్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇండియా క్రికెట్ బోర్డ్ బిసిసిఐ.. టీమిండియా ఆడబోయే మ్యాచ్ లన్నీ మరో దేశంలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ బోర్డుని కోరనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ ని 2023 ఆసియా కప్ లాగా హైబ్రిడ్ మాడల్ లో నిర్వహించాలని బిసిసిఐ ప్రతిపాదనుంచనుంది.

Advertisement

Also Read: Hardik Pandya | లోకం అంతా ఒకవైపు.. పాండ్యా ఒక్కడూ ఒకవైపు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొనగా.. మొత్తం 15 మ్యాచ్ లు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 2024 మధ్య జరుగనున్నాయి. ఈ 15 మ్యాచ్ లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఏడు లాహోర్‌లో , అయిదు రావల్ పిండిలో, మూడు కరాచీలో నిర్వహించనుంది. వీటిలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే హోరాహోరీ మ్యాచ్ మార్చి 1న లాహోర్ లో షెడ్యూల్ చేశారు.

Advertisement

కానీ టీమిండియా 2008 తరువాత నుంచి పాకిస్తాన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత 16 ఏళ్లలో రెండు దేశాల మధ్య 2012-13లో ఒక సిరీస్ మాత్రమే జరిగింది. పైగా పాకిస్తాన్ లో జరిగిన 2023లో ఆసియా కప్ సిరీస్ కు కూడా ఇండియా జట్టు వెళ్లలేదు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరిగింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య బార్డర్ వివాదంతో తలెత్తిన శత్రుత్వమే దీనికి కారణం.

Also Read: టీమిండియా హెడ్ కోచ్ సాలరీ ఎంతో తెలుసా?.. రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రితో సమానంగా గౌతమ్ గంభీర్

టీమిండియా పాకిస్తాన్ వెళ్లకపోయినా.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాలో జరిగిన 2023 వన్ డే ప్రపంచ్ కప్ లో పాల్గొనింది. వన్డే ప్రపంచ కప్ లో భాగంగా హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా జరిగిన మ్యాచ్ లలో పాకిస్తాన్ ఆడింది.

ఈ నేపథ్యంలో టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లాలో.. లేదో? భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×