E-Paper
Advertisement

CM Revanth Reddy: మెస్సీ తో ఫుట్ బాల్ మ్యాచ్..బ‌రిలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మెస్సీ తో  ఫుట్ బాల్ మ్యాచ్..బ‌రిలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) కొత్త అవతారంలో కనిపించారు. రాజకీయ నాయకుడు గానే కాకుండా, తనలో ఫుట్ బాల్ ప్లేయర్ ఉన్నాడని మరోసారి గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారింది. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ నగరానికి అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి (Lionel Messi) రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆ రోజున హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి తో ఫుట్ బాల్‌ మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

ఫుట్ బాల్‌ ప్లేయర్ గా మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫుట్ బాల్‌ ప్లేయర్ల లాగా జెర్సీ ధరించి, సామాన్యుడిలాగా అందరిలో కలిసిపోతున్నారు డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి. MCHRD గ్రౌండ్ లో ప్రొఫెషనల్ ప్లేయర్లతో కలిసి మ్యాచ్ కూడా ఆడారు. గ్లోబల్ సబ్మిట్ ముగింపు సందర్భంగా జరగనున్న ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లో RR-9 జట్టు తరుఫున తెలంగాణ ముఖ్యమంత్రి 9వ నెంబర్ జెర్సీలో బరిలోకి దిగ‌బోతున్నారు. LM-10 జట్టు తరుఫున పదవ నెంబర్ జెర్సీలో లియోనెల్ మెస్సి బరిలో దిగనున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ కూడా ఖ‌రారు అయింది.

సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ తో ఫుట్ బాల్ ఆడ‌టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. క్రీడా స్ఫూర్తి… తెలంగాణ కీర్తి అన్నారు. ఈ నెల 13 న ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ తో ఫుట్ బాల్ క్రీడలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ ప్రారంభించానని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ ను క్రీడా వేదిక నుండి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచన నేపథ్యంతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగానన్నారు. అంతేకాదు, సోమ‌వారం తాను ప్రాక్టీస్ చేసిన వీడియోలు పంచుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన‌ ట్వీట్ వైర‌ల్ గా మారింది.

కాగా, ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్ రాబోతున్నారు. డిసెంబర్ 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఆయన మ్యాచ్ కూడా ఆడతారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్ తో పాటు సెలబ్రిటీల ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

 

 

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×