Virender Sehwag on RCB: రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు (Royal Challengers Bengaluru team) 18 సంవత్సరాల తర్వాత టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. మొన్నటి 2025 సందర్భంగా టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… 2026 ట్రోఫీని కూడా దక్కించుకుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజధాని బెంగళూరు జట్టుకు ఆదరణ మరింత పెరిగింది. అయితే అలాంటి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి.. వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉగాండా కంటే దారుణం అంటూ పరువు తీశారు. అలాంటి జట్టు రెండు సార్లు టైటిల్ గెలిచిందంటే తనకు నవ్వు వస్తుందని పరువు తీశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రెండుసార్లు వరుసగా ఛాంపియన్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి వీరేంద్ర సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రమే తన దృష్టిలో బలమైనవి అంటూ వ్యాఖ్యానించారు. ఈ జట్లను ఎదుర్కోవడం చాలా కష్టమేనని… ఇందులో వరల్డ్ గ్లాస్ ప్లేయర్లు ఉన్నారని వివరించారు. రాయల్ చాలెంజెస్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లను సులభంగా ఓడించగలుగుతామని వెల్లడించారు. అసలు ఈ జట్లు పోటీ కూడా ఇవ్వబోవని పరువు తీశారు. ఈ జట్లతో మ్యాచ్ జరిగితే రెండు పాయింట్లు సులభంగా సంపాదించవచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును చాలా చీప్ గా చూసేవాడినని వివరించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉగాండాతో సమానం అంటూ పరుగు తీశారు వీరేంద్ర సెహ్వాగ్.
2025, 2026 టోర్నమెంట్స్ లలో వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ అయింది. 18 సంవత్సరాల ఆకలి… వరుసగా రెండు టైటిల్స్ గెలిచి తీర్చుకుంది. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్స్ రెండు రావడం పెద్ద జోక్ అని హేళన చేస్తూ మాట్లాడారు. తన దృష్టిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాలా చీప్ అని… అయినా టైటిల్ గెలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ రెండు టైటిల్స్ గెలిచిన తర్వాత మళ్ళీ ఛాంపియన్ కావడం కష్టమేనని స్పష్టం చేశారు. రజత్ పటిదార్ లక్ వల్ల బెంగళూరుకు టైటిల్స్ వచ్చాయని వెల్లడించారు.