Ponguleti Srinivas: BRS తలకిందులు తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే అని మంత్రి పొంగులేటి అన్నారు. రైతులకు సంకెళ్ళు వేసిన చరిత్ర BRS పార్టీదీ, రెవిన్యూ, దేవాదాయ భూములు కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పని మంత్రి హెచ్చరించారు. BRS కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యారు.
BRS చేస్తున్న ఆరోపణలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, గత పాలకులు పగటి కలలు కంటున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక పోతున్నారు. హైదరాబాద్లొ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే BRS ప్రభుత్వంపై విషం చిమ్ముతూ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యారు. గత పాలకులు రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
Also raed: శ్రీశైలం నీళ్లు తరలించేందుకు ఏపీ భారీ స్కెచ్.. ఎండిపోతున్న పాలమూరు, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్!
కోట్లాడి సాధించిన తెలంగాణలో కూడా సీలింగ్ భూముల సమస్య పరిష్కారం కాలేదన్నారు. 70ఏళ్ల భూ సమస్యను ప్రజా ప్రభుత్వం పరిష్కరించింది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం అని కొనియాడారు. తుంగతుర్తి నియోజకవర్గానికి అదనపు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు పై కేబినెట్లో చర్చిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఓట్లు అడగం లబ్ధిదారులే ప్రభుత్వానికి అండగా ఉంటారని మంత్రి పొంగులేటి తెలిపారు.
Also read: గేమింగ్ నుంచి మ్యూజిక్ వరకు.. Beyerdynamic టాప్ 5 హెడ్ఫోన్స్ ఇవే!