BigTV English
Advertisement

Gavaskar On RCB : 18 ఏళ్లు ఏం పీకారు? బెంగళూరు తొక్కిసలాటపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

Gavaskar On RCB : 18 ఏళ్లు ఏం పీకారు? బెంగళూరు తొక్కిసలాటపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

Gavaskar On RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 ఐపీఎల్ సీజన్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ  సందర్భంగా చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట గురించి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు తమ ప్రాణాలను కోల్పోవడం ‘హృదయ విదారకంగా’ ఉందని అన్నారు. తమ అభిమాన జట్టు ట్రోఫీని ఎగురవేసేందుకు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోవడం అర్థం చేసుకోదగినది అని.. దానికి ఎవరికైనా నిందించడం ఇప్పుడు వ్యర్థ్యం అని పేర్కొన్నాడు.


Also Read : Watch Video : ఈ బుడ్డోడు ఏంట్రా.. బుమ్రానే మించిపోయాడు.. ఆ యార్కర్ కు వికెట్ ఎగిరిపోయిందిగా

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం నిజంగా నిజంగా హృదయ విదారకంగా  ఉందని గవాస్కర్ తెలిపాడు. ముఖ్యంగా ఆ ప్రజలు కోరుకునేది సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించలేదని.. గత రెండు నెలల నుంచి తమకు చాలా సంతోషం, ఆనందం కలిగించిందని తెలిపారు. అయితే కొంత మంది చనిపోవడం.. మరికొంత మంది గాయపడటం, ఆసుపత్రిలో చికిత్స పొందడం ఓ విషాదకరమైన ఘటన అన్నారు. ఇందులో ఎవ్వరినీ నిందించినా ప్రయోజనం లేదని.. జీవితాలను తిరిగి తీసుకురాలేము.. కొన్ని గాయాలు ఎప్పటికీ సరిగ్గా నయం కావని.. మానసికమైనవని తెలిపారు. మరోవైపు ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ సందర్భంగా బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పై బీసీసీఐ కూడా ఇటీవలే స్పందించింది. ముఖ్యంగా సెలబ్రేషన్స్ సరిగ్గా ప్లాన్ చేసి ఉండాల్సింది అంటూ ఆర్సీబీ మేనేజ్ మెంట్ పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.


వాస్తవానికి 18 సంవత్సరాల తరువాత ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ గెలిచినందున బెంగళూరులో ఇది చిరస్మరణీయమైన రోజుగా భావించారు. కానీ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. ఛాంపియన్ జట్టును వీక్షించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల దాదాపు 2 లక్షల మంది అభిమానులు గుమిగూడారు. పోలీసులు భారీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారు. అసలు ఇంత పెద్ద విజయోత్సవ వేడుకలను నిర్వహించేటప్పుడు సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఐపీఎల్ ఇంత అద్భుతంగా ముగిసిన తరువాత ఇది యాంటీ క్లైమక్స్ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై, కోల్ కతా వంటి జట్లు గెలిచినప్పటికీ విజయోత్సవ సంబురాలు పలు జాగ్రత్తలతో జరుపుకున్నార. పద్దెనిమిదేళ్ల తరువాత టైటిల్ సాధించడం.. బెంగళూరులో విరాట్ కోహ్లీ అభిమానులు భారీగా తరలిరావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని పలువురు పేర్కొనడం విశేషం. 

 

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×