E-Paper
Advertisement

Haris Rauf On Indian Team: దుబాయ్‌ లో చిత్తుగా ఓడిస్తాం.. టీమిండియాకు పాక్‌ బౌలర్‌ హెచ్చరికలు !

Haris Rauf On Indian Team: దుబాయ్‌ లో చిత్తుగా ఓడిస్తాం.. టీమిండియాకు పాక్‌ బౌలర్‌ హెచ్చరికలు !
Advertisement

Haris Rauf On Indian Team: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా రేపు భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దుబాయిలో జరగబోతున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు పూర్తి విశ్వాసంతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమిని మూటగట్టుకుంది.

 

Advertisement

ఇక సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్ పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. భారత్ తో మ్యాచ్ కోసం మహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ఫిబ్రవరి 20న కరాచీ నుండి దుబాయ్ కి చేరుకుంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ ని కూడా మొదలుపెట్టింది.

మరోవైపు భారత్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి మూడు వారాల ముందే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో జరిగే మ్యాచ్ గురించి తాము ఎక్కువగా ఆలోచించడం లేదని తెలిపాడు. దుబాయ్ లో పాకిస్తాన్ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా హరీస్ రౌఫ్ మాట్లాడుతూ.. ” టి-20 ప్రపంచ కప్ 2021, ఆసియా కప్ 2022లో భారత్ పై గెలిచిన విజయాలనుంచి స్ఫూర్తి పొందుతాం.

Advertisement

భారత్ తో మ్యాచ్ సందర్భంగా మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మా ఆటగాళ్లు అందరూ రిలాక్స్ గా ఉన్నారు. ఇది ఓ సాధారణ మ్యాచ్ మాత్రమే. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్ ల లాగే జరుగుతుంది. అయితే దుబాయిలోని పరిస్థితులపైనే మా ఆట ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాకు నమ్మకాన్ని ఇస్తుంది. గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ మేము భారత్ ని ఓడించాం. ఆ మ్యాచ్లలో చేసిన మంచి పనులని మళ్లీ చేసి భారత్ ని ఓడించడానికి ప్రయత్నిస్తాం.

 

ఇది మంచి మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా. మా రికార్డులు కూడా బాగానే ఉన్నాయి. అయితే దుబాయ్ పిచ్ లాలో స్పిన్ ట్రాక్ కూడా ఉండొచ్చు. పరిస్థితులను బట్టి వాటిని బాగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం” అని రౌఫ్ తెలిపాడు. అయితే ఓవరాల్ గా ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పై భారత్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఇరుజట్లు 21సార్లు తలపడ్డాయి. వీటిలో 16 మ్యాచ్లలో భారత్ విజయం సాధించగా. పాకిస్తాన్ కేవలం ఐదు మ్యాచ్లలో మాత్రమే గెలుపొందింది. ఈ టోర్నీ లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో హరీష్ రావు ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.

 

 

View this post on Instagram

 

Related News

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

Big Stories

Advertisement
×