E-Paper
Advertisement

IND vs AUS: వారెవా క్యా సీన్‌హై.. టెస్ట్ మ్యాచ్‌కు ఇద్దరు ప్రధానులు..

IND vs AUS: వారెవా క్యా సీన్‌హై.. టెస్ట్ మ్యాచ్‌కు ఇద్దరు ప్రధానులు..
Advertisement

IND vs AUS: ఆట అద్భుతాలు చేస్తుంది. మైదానంలోనైనా. బయటైనా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. క్రికెట్‌లో టగ్ ఆఫ్ వార్ టీమ్‌లు. స్లెడ్జింగ్‌లో టాప్‌లో ఉండే ఆసీస్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంఠే. ఇదంతా ఆట వరకే పరిమితం. బయట ఇరుజట్ల ఆటగాళ్ల స్నేహం. ప్లేయర్సే కాదు.. ప్రధానులను సైతం ఒక్కచోటకు చేర్చింది క్రికెట్. అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్-ఆసీస్‌ నాలుగో టెస్టు మ్యాచ్‌కి.. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ ఆల్బనీస్‌ విచ్చేసి.. ఆటకు మించి అనిపించారు. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఇందుకు వేదికగా నిలిచింది.

75 ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా.. మోదీ, ఆంటోనీ ఆల్బనీస్‌ స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మకు ప్రధాని మోదీ.. ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు ఆ దేశ ప్రధాని ఆల్బనీస్‌ టెస్టు క్యాప్‌లు అందించారు.

Advertisement

ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్‌ కారులో మైదానమంతా కలియదిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు.

మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన మోదీ, ఆల్బనీస్‌లను BCCI ఘనంగా సత్కరించింది. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరఫున అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ.. ఆసీస్‌ ప్రధానికి ప్రత్యేక మెమొంటోను అందజేశారు. బీసీసీఐ కార్యదర్శి జై షా.. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు.

Advertisement

బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది టీమిండియా. నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోంది ఆసీస్.

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×