Ind vs Eng 2nd Semi-Final: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా, ఇంగ్లాండ్ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో నువ్వా నేనా అన్న రేంజిలో రెండు జట్లు ఢీ కొట్టుకున్నాయి. కానీ చివరికి ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియానే విజయం సాధించింది. ఈ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ తరుణంలోనే 7 వికెట్లు నష్టపోయి, 253 పరుగులు సాధించింది టీమిండియా. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ పోరాడి ఓడింది. టీమిండియా విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో 20 ఓవర్లు ఆడింది ఇంగ్లాండ్. ఈ క్రమంలో ఏడు వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు కేవలం 246 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో టీమిండియా ఏడు పరుగులతో విజయం సాధించి, వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. అటు ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టింది. దీంతో మార్చి ఎనిమిదో తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా బాపుగా పిలుచుకునే అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ లు అందుకున్నాడు. ముఖ్యంగా విల్ జాక్స్ కొట్టిన బంతిని బౌండరీ గేటు దగ్గర అందుకొని… శివం దూబేకు అందించాడు. ఇక అప్పటి నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయింది. లేకపోయి ఉంటే వీల్ జాక్స్, జాకబ్ బెతెల్ ఇద్దరు ఇంగ్లాండ్ ను గెలిపించేవాళ్లు. కానీ బాపు అందుకున్న క్యాచ్ ల కారణంగా టీమిండియా విజయం సాధించింది. అటు ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ డేంజర్ ఆటగాడు జాకబ్ బెతెల్ ఇండియాకు చుక్కలు చూపించాడు. ఒకానొక సమయంలో ఇండియా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా అతన్ని రనౌట్ చేశాడు. అప్పటికి 48 బంతుల్లో 105 పరుగులు సాధించాడు జాకబ్ బెతెల్. ఇందులో ఏడు సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. 218 స్ట్రైక్ రేటుతో ఇండియాకు నరకం చూపించాడు. కానీ టీమిండియా బౌలర్లు చివరలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో… ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. ఇక ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా తలపడనుంది.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ మరో ఓపెనర్ సంజు శాంసన్ ఇరగదీశాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. 89 పరుగులతో రాణించాడు. అటు ఇషాన్ కిషన్ తన వంతు సాయంగా 18 బంతుల్లో 39 పరుగులతో రెచ్చిపోయాడు. అటు మరో ఆల్ రౌండర్ శివం దుబే 25 బంతుల్లో 43 పరుగులు చేసి దుమ్ము లేపాడు. హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చేసిన 21 పరుగులు మ్యాచ్ కు కీలకంగా మారాయి.
Wankhede erupts again as India grab a massive wicket! 🔥🇮🇳
Arshdeep Singh dismisses the dangerous Will Jacks for 35 (20), and it’s a brilliant combination catch from Axar Patel and Shivam Dube! 👏#INDvENG #Wankhede #Sportskeeda pic.twitter.com/eJRcYJq1A9
— Sportskeeda (@Sportskeeda) March 5, 2026